Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య రామాలయంలో ప్రియాంక చోప్రా దంపతులు.. మెరిసిన మాల్తీ

సెల్వి
గురువారం, 21 మార్చి 2024 (18:37 IST)
Priyanka Chopra
నటి ప్రియాంక చోప్రా జోనాస్, ఆమె భర్త, అమెరికన్ గాయకుడు నిక్ జోనాస్ తన పుత్రికతో కలిసి అయోధ్యను సందర్శించుకున్నారు. ప్రియాంక చోప్రా రెండేళ్ల కుమార్తె మాల్తీ మేరీ జోనాస్‌తో కలిసి అయోధ్యలోని రామమందిరంలో పూజలు చేశారు.
 
పసుపు రంగు చీర ధరించిన ప్రియాంక చోప్రా, కుర్తాలో నిక్ జోనాస్, పీచ్ కలర్ గౌనులో మాల్తీలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రామయ్య దర్శనం, పూజల తర్వాత ఆలయ పూజారుల నుంచి తీర్థప్రసాదాలు అందుకున్నారు. పూజారుల ఆశీస్సులు తీసుకున్నాక వారితో కలిసి ఫొటోలకు ఫోజిచ్చారు.
 
అంతకుముందు రోజు, ఈ స్టార్ జంట తమ కుమార్తెతో అయోధ్య విమానాశ్రయంలో ఫోటోలకు ఫోజులిచ్చారు. 
 
జనవరి 22న జరిగిన మహా సంప్రోక్షణ మహోత్సవం తర్వాత వారు రామమందిరాన్ని ప్రియాంక చోప్రా సందర్శించడం ఇదే తొలిసారి. ఈ వేడుకకు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అలియా భట్-రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ రిషబ్ శెట్టితో సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఇకపోతే.. ప్రియాంక చోప్రా మంగళవారం ముంబైలో జరిగిన ప్రైమ్ వీడియో ప్రెజెంట్స్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన రాబోయే ప్రాజెక్టు "విమెన్ ఆఫ్ మై బిలియన్" డాక్యుమెంటరీని వివరాలను మీడియాతో షేర్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తే అత్యున్నత పదవులు వరిస్తాయా? నాడు ముర్ము - నేడు సీపీఆర్

కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి - విద్యుత్ షాక్‌తో ఐదుగురి మృతి

కుమార్తె అప్పగింత వేళ ఆగిన గుండె... పెళ్లింట విషాదం!

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీఆర్ - చంద్రబాబు - పవన్ హర్షం

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments