Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవు - కొబ్బరికాయది హిందూమతమా? ఖర్జూరం - గొర్రె ముస్లిం మతంలో చేరాయా?

సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవు, కొబ్బరికాయ ఎపుడు హిందూ మతం పుచ్చుకున్నాయనీ, ఖర్జూరం, గొర్రె ఎపుడు ముస్లిం మతం స్వీకరించాయని ఆయన ప్రశ్నించారు.

Webdunia
శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (12:27 IST)
సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవు, కొబ్బరికాయ ఎపుడు హిందూ మతం పుచ్చుకున్నాయనీ, ఖర్జూరం, గొర్రె ఎపుడు ముస్లిం మతం స్వీకరించాయని ఆయన ప్రశ్నించారు. అలాగే, పసుపు, కాషాయ వర్ణాలది ఏ జాతి అంటూ బీజేపీ నేతలను ఆయన నిలదీశారు. 
 
కర్ణాటకలోని శివమొగ్గలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ కమలనాథులపై మరోమారు విరుచుకుపడ్డారు. తాను వెళ్లిన ప్రతి చోట కొందరు మతఛాందసవాదులు ఆవు పేడతో కళ్లాపి చల్లి, గోమూత్రంతో శుద్ధి చేస్తున్నారన్నారు. ఇదెక్కడి వింత ఆచారమన్నారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కానని, అణగారిన వర్గాలకు ఎప్పడూ అండగా ఉంటానని తేల్చి చెప్పారు. బీజేపీపై తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తేల్చి చెప్పారు. 
 
మనిషి కన్నా గోవే ముఖ్యమని కొందరు మతఛాందసవాసులు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కొందరు ఆ తర్వాత రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారని, దళితులను శునకాలతో పోలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార పద్ధతుల గురించి ప్రశ్నించే నాయకులకు మనుషులు కనిపించడం లేదా? అని కేంద్రమంత్రి, బీజేపీ నేత అనంతకుమార్ హెగ్డేను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments