Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవు - కొబ్బరికాయది హిందూమతమా? ఖర్జూరం - గొర్రె ముస్లిం మతంలో చేరాయా?

సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవు, కొబ్బరికాయ ఎపుడు హిందూ మతం పుచ్చుకున్నాయనీ, ఖర్జూరం, గొర్రె ఎపుడు ముస్లిం మతం స్వీకరించాయని ఆయన ప్రశ్నించారు.

Webdunia
శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (12:27 IST)
సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవు, కొబ్బరికాయ ఎపుడు హిందూ మతం పుచ్చుకున్నాయనీ, ఖర్జూరం, గొర్రె ఎపుడు ముస్లిం మతం స్వీకరించాయని ఆయన ప్రశ్నించారు. అలాగే, పసుపు, కాషాయ వర్ణాలది ఏ జాతి అంటూ బీజేపీ నేతలను ఆయన నిలదీశారు. 
 
కర్ణాటకలోని శివమొగ్గలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ కమలనాథులపై మరోమారు విరుచుకుపడ్డారు. తాను వెళ్లిన ప్రతి చోట కొందరు మతఛాందసవాదులు ఆవు పేడతో కళ్లాపి చల్లి, గోమూత్రంతో శుద్ధి చేస్తున్నారన్నారు. ఇదెక్కడి వింత ఆచారమన్నారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కానని, అణగారిన వర్గాలకు ఎప్పడూ అండగా ఉంటానని తేల్చి చెప్పారు. బీజేపీపై తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తేల్చి చెప్పారు. 
 
మనిషి కన్నా గోవే ముఖ్యమని కొందరు మతఛాందసవాసులు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కొందరు ఆ తర్వాత రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారని, దళితులను శునకాలతో పోలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార పద్ధతుల గురించి ప్రశ్నించే నాయకులకు మనుషులు కనిపించడం లేదా? అని కేంద్రమంత్రి, బీజేపీ నేత అనంతకుమార్ హెగ్డేను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments