Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహన్ బాబు రౌడీయిజం, బూతులను హైలెట్ చేసిన ప్రకాష్ రాజ్

Webdunia
గురువారం, 14 అక్టోబరు 2021 (17:42 IST)
మా ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్‌ను ఓడించి గెలిచారు. అయితే ప్రకాష్ రాజ్ ఓడిపోయినా తర్వాత మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
ఈ విషయంపై మంచు విష్ణు కూడా స్పందించాడు. పరాజయం తర్వాత ప్రకాష్ రాజ్ చాలా సీరియస్‌గా ఉన్నాడు. మంచు విష్ణు కలిసి మాట్లాడుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని చెప్పిన రాజినామా వెనక్కి తీసుకోవాలని కోరిన ప్రకాష్ రాజ్ మాత్రం ఎక్కడ తగ్గకుండా ఉన్నాడు.
 
తన రాజీనామా నిర్ణయం వెనుక లోతైన అర్ధం ఉందని మొన్న సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ మరొకసారి గొడవలు రేపే విధంగా మాట్లాడారు. ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ ఒక లేఖను రాసారు. 
 
మా ఎన్నికల్లో మోహన్ బాబు రౌడీయిజం, బూతులను హైలెట్ చేస్తూ లేఖ రాయడంతో మరొకసారి వివాదం రాజుకుంది. ఎన్నికలకు సంబంధించిన సిసి టివి ఫుటేజ్ ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాసారు.
 
వీలైనంత త్వరగా ఆ సిసిటివి ఫుటేజ్ ఇవ్వకపోతే దానిని మాయం చేస్తారని ఆయన కోరారు. కొందరు సభ్యులను గాయపరిచారని ఆ సిసి టివి ఫుటేజ్ బయటకు వస్తే అన్ని తెలుస్తాయని తెలిపారు. దీనిపై కృష్ణ మోహన్ స్పందిస్తూ సిసి టీవీ ఫుటేజ్ సేఫ్ గానే ఉందని నిబంధనలు ప్రకారం ఎవరు అడిగిన ఇస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments