ప్రభాస్ సరసన ఇద్దరు హీరోయిన్లు!!

వరుణ్
మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (11:21 IST)
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. వీరిలో ఒకరు బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ కాగా, మరొకరు నయనతారను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా "కల్కి" తెరకెక్కుతుంది. మరోవైపు, "రాజాసాబ్" చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాల్లో ప్రభాస్‌కి సంబంధించిన పోర్షన్ షూటింగును త్వరలోనే పూర్తికానున్నాయి. ఆ తర్వాత నుంచి ఆయన సందీప్ రెడ్డి వంగాతో కలిసి సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. డిసెంబరు నుంచి స్పిరిట్ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగనుంది. 
 
ఈ "స్పిరిట్" చిత్రంలో ఇద్దుర హీరోయిన్లను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఒక హీరోయిన్ పాత్ర కోసం కియారా అద్వానీని, మరో హీరోయిన్ పాత్ర కోసం నయనతారను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజంగా ఈ ఇద్దరినీ తీసుకోవడం జరిగితే ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్‌లో పెరిగిపోవడం ఖాయంగా తెలుస్తుంది. 
 
దక్షిణాది ప్రేక్షకుల్లో కియారా అద్వానీకి మంచి క్రేజ్ ఉంది. ఇక నయనతారకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే, "జవాన్" సినిమాతో కూడా నయనతార మార్కెట్ బాలీవుడ్‌లోనూ పెరిగిపోయింది. దీంతో స్పిరిట్ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కాగా, ఈ ప్రాజెక్టును రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments