Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ సరసన ఇద్దరు హీరోయిన్లు!!

వరుణ్
మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (11:21 IST)
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. వీరిలో ఒకరు బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ కాగా, మరొకరు నయనతారను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా "కల్కి" తెరకెక్కుతుంది. మరోవైపు, "రాజాసాబ్" చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాల్లో ప్రభాస్‌కి సంబంధించిన పోర్షన్ షూటింగును త్వరలోనే పూర్తికానున్నాయి. ఆ తర్వాత నుంచి ఆయన సందీప్ రెడ్డి వంగాతో కలిసి సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. డిసెంబరు నుంచి స్పిరిట్ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగనుంది. 
 
ఈ "స్పిరిట్" చిత్రంలో ఇద్దుర హీరోయిన్లను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఒక హీరోయిన్ పాత్ర కోసం కియారా అద్వానీని, మరో హీరోయిన్ పాత్ర కోసం నయనతారను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజంగా ఈ ఇద్దరినీ తీసుకోవడం జరిగితే ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్‌లో పెరిగిపోవడం ఖాయంగా తెలుస్తుంది. 
 
దక్షిణాది ప్రేక్షకుల్లో కియారా అద్వానీకి మంచి క్రేజ్ ఉంది. ఇక నయనతారకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే, "జవాన్" సినిమాతో కూడా నయనతార మార్కెట్ బాలీవుడ్‌లోనూ పెరిగిపోయింది. దీంతో స్పిరిట్ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కాగా, ఈ ప్రాజెక్టును రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments