Webdunia - Bharat's app for daily news and videos

Install App

రావణాసురుడుగా ప్రభాస్... సీతగా దీపికా... రాముడుగా హృతిక్ (Video)

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (15:46 IST)
'బాహుబలి' చిత్రంతో అంతర్జాతీయ హీరోగా మారిపోయిన టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్... ఇటీవల 'సాహో'గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. అయితే, కలెక్షన్ల పరంగా ఔరా అనిపించింది. కానీ, అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. 
 
ఈ నేపథ్యంలో ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్టులో రావణాసురుడుగా కనిపించనున్నారట. ఇందులో సీత పాత్రను దీపికా పదుకొనె చేయనున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. రామాయణ కథతో ప్రముఖ దర్శకుడు నితేశ్‌ తివారీ తెరకెక్కించబోతున్నారు. 
 
ఈ ప్రాజెక్టును రూ.600 కోట్ల వ్యయంతో మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారట. ఇందులో బలమైన రావణుడి పాత్ర కోసం ప్రభాస్‌ను చిత్రబృందం సంప్రదించినట్టు సమాచారం. అయితే, ఇప్పటివరకు ప్రభాస్‌ ఈ సినిమాకు ఓకే చెప్పలేదని, ఆయన టీమ్‌ ప్రస్తుతం ఈ ప్రాజెక్టు టేకాప్‌ చేయొచ్చా లేదా? అన్నది బేరిజువేసే పనిలో ఉందని పింక్‌విల్లా వెబ్‌సైట్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. 
 
కాగా, ఈ ప్రాజెక్టును ఏకకాలంలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించనున్నారు. ప్రభాస్‌కు ఉన్న దేశవ్యాప్త స్టార్‌డమ్‌తోపాటు హైట్‌, పర్సనాలిటీపరంగా రావణుడి పాత్రకు సరిగ్గా సూటయ్యే లక్షణాలు ఉండటంతో ఆయనను ఈ సినిమా కోసం తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ప్రభాస్‌ రావణుడి పాత్రను చేస్తే.. ఆ పాత్రకు న్యాయం చేయడమేకాకుండా ప్రజల్లో మరింత హైప్‌ వచ్చే అవకాశముంటుందన్నది చిత్ర యూనిట్ భావన. 
 
మరోవైపు రాముడిగా హృతిక్‌ రోషన్‌, సీతగా దీపికా పదుకొణె నటించే అవకాశముండటంతో వారికి ధీటుగా రావణుడి పాత్రలో ప్రభాస్‌ అలరించే అవకాశముంటని బాలీవుడ్‌ వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో సీతారాములుగా హృతిక్‌, దీపిక నటించనున్నారని కథనాలు రాగా.. ఇంకా ఈ సినిమా కోసం క్యాస్టింగ్‌ ఫైనల్‌ చేయలేదని ఈ వార్తలను దర్శకుడు నితేశ్‌ కొట్టిపారేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యం.. చక్రం తిప్పిన సీఎం అల్లుడు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments