Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు ఎవరి డీపీ పెట్టుకున్నావో.. ఆయన విలువ తియ్యకు... పూనమ్ కౌర్

పూనమ్ కౌర్‌కీ, ఓ నెటిజన్‌కీ మధ్య నడిచిన మాటల యుద్ధం ట్విట్టర్‌లో సంచలనంగా మారింది. మొదట పూనమ్ ఆంధ్ర, తెలంగాణ ఫైట్ చేసుకుంటూ ఉంటే ఫాయిదా ఎవరికీ అంటూ ట్వీట్ పెట్టడంతో వివాదం మొదలైంది.

Webdunia
ఆదివారం, 7 అక్టోబరు 2018 (12:52 IST)
పూనమ్ కౌర్‌కీ, ఓ నెటిజన్‌కీ మధ్య నడిచిన మాటల యుద్ధం ట్విట్టర్‌లో సంచలనంగా మారింది. మొదట పూనమ్ ఆంధ్ర, తెలంగాణ ఫైట్ చేసుకుంటూ ఉంటే ఫాయిదా ఎవరికీ అంటూ ట్వీట్ పెట్టడంతో వివాదం మొదలైంది. 
 
ఆంధ్ర, తెలంగాణ మన వాళ్లే ఫైట్ చేసుకుంటూ ఉంటే.. ఫాయిదా ఎవరికి అబ్బా? నాకు అయితే ఏమీ అర్థం కావట్లే.. ఇదిగో ఈ స్కూల్ స్టోరీ గుర్తుకు వచ్చిందంటూ అంటూ పిల్లీ.. పిల్లీ కొట్టుకుంటుంటే మధ్యలో కోతి లాభ పడిన ఓ కార్టూన్‌ను పోస్ట్ చేసింది.
 
దీనిని చూసిన ఓ నెటిజన్.. ''ఓటుకి నోటు వల్ల ఫాయిదా ఎవరికి.. కనీస మెచ్యూరిటీ లేని పొలిటికల్ ట్వీట్ ఇది... మీరు ఎంత అన్నా మీ వల్ల టీడీపీకి ఒక్క ఓటు రాదు'' అని కామెంట్ పెట్టాడు. అయితే ఆ నెటిజన్ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిక్ తన డిస్‌ప్లే పిక్‌గా పెట్టుకున్నాడు. 
 
దీంతో పూనమ్.. ''నువ్వు ఎవరి డీపీ పెట్టుకున్నావో.. ఆయన విలువ తియ్యకు. నువ్వు అసభ్యకరమైన భాషను వాడుతున్నావా? సినిమానా పంచెస్ కొట్టడానికి... నీ వ్యాఖ్యలు రోత పుట్టిస్తున్నాయి. మనం మాట్లాడిన ప్రతిదాన్ని చాలా కుటుంబాలు, ప్రజలు చూస్తున్నారు'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahanadu: కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది: చంద్రబాబు

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు (Video)

కొత్త పార్టీ కథ లేదు.. బీఆర్ఎస్‌ను బీజేపీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్: కవిత

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments