Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై వివక్ష : పూజా హెగ్డే

ఠాగూర్
ఆదివారం, 23 మార్చి 2025 (10:57 IST)
చిత్రపరిశ్రమలో హీరోయిన్లు వివక్షకు గురవుతున్నారని ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే అభిప్రాయపడ్డారు. సినిమా లొకేషన్‌లో తమ కారావాన్లు కూడా సెట్‌కు దూరంగా ఉంటాయని, కొన్నిసార్లు సినిమా వాల్ పోస్టర్లలో హీరోయిన్ల పేరు కూడా ఉండదని ఆమె విమర్శించారు. 
 
సాధారణంగా చిత్రపరిశ్రమలో హీరోయిన్లను చిన్నచూపు చూస్తారన్నది జగమెరిగిన సత్యం. దీనిపై పూజా హెగ్డే స్పందిస్తూ, షూటింగ్ స్పాట్‌లలో హీరోలు కారావాన్లు సెట్‌కు దగ్గరగా ఉంటాయని, హీరోయిన్లవి మాత్రం ఎక్కడో దూరంగా ఉంటాయని వాపోయింది. తాము పొడవైన, బరువైన కాస్ట్యూమ్స్ ధరించి నడుచుకుంటూ అంతదూరం వెళ్లాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
హీరోయిన్లు పలు రకాలుగా వివక్షకు గురవుతుంటారని చెప్పింది. కొన్నిసార్లు పోస్టర్లలో హీరోయిన్ల పేరు కూడా ఉండదని గుర్తుచేశారు. ఇన్నేళ్లుగా తాను ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ తనను తాను సెకండ్ గ్రేడ్ వ్యక్తగానే భావిస్తానని చెప్పుకొచ్చింది. 
 
ఇకపోతే, సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలో నటిస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. వీటిలో రజనీకాంత్, విజయ్, సూర్య, షాహిద్ కపూర్ చిత్రాలు ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - తితిదే నిర్ణయం

బ్రో అని పిలిచినందుకు - స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఇంటి యజమాని దాడి!!

మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు.. తదుపరి టార్గెట్ ఆమేనా?

Konidela Village: కొణిదెల గ్రామానికి రూ.50లక్షలు ప్రకటించిన పవన్ కల్యాణ్

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments