సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై వివక్ష : పూజా హెగ్డే

ఠాగూర్
ఆదివారం, 23 మార్చి 2025 (10:57 IST)
చిత్రపరిశ్రమలో హీరోయిన్లు వివక్షకు గురవుతున్నారని ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే అభిప్రాయపడ్డారు. సినిమా లొకేషన్‌లో తమ కారావాన్లు కూడా సెట్‌కు దూరంగా ఉంటాయని, కొన్నిసార్లు సినిమా వాల్ పోస్టర్లలో హీరోయిన్ల పేరు కూడా ఉండదని ఆమె విమర్శించారు. 
 
సాధారణంగా చిత్రపరిశ్రమలో హీరోయిన్లను చిన్నచూపు చూస్తారన్నది జగమెరిగిన సత్యం. దీనిపై పూజా హెగ్డే స్పందిస్తూ, షూటింగ్ స్పాట్‌లలో హీరోలు కారావాన్లు సెట్‌కు దగ్గరగా ఉంటాయని, హీరోయిన్లవి మాత్రం ఎక్కడో దూరంగా ఉంటాయని వాపోయింది. తాము పొడవైన, బరువైన కాస్ట్యూమ్స్ ధరించి నడుచుకుంటూ అంతదూరం వెళ్లాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
హీరోయిన్లు పలు రకాలుగా వివక్షకు గురవుతుంటారని చెప్పింది. కొన్నిసార్లు పోస్టర్లలో హీరోయిన్ల పేరు కూడా ఉండదని గుర్తుచేశారు. ఇన్నేళ్లుగా తాను ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ తనను తాను సెకండ్ గ్రేడ్ వ్యక్తగానే భావిస్తానని చెప్పుకొచ్చింది. 
 
ఇకపోతే, సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలో నటిస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. వీటిలో రజనీకాంత్, విజయ్, సూర్య, షాహిద్ కపూర్ చిత్రాలు ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ambassador Car: పాత అంబాసిడర్ కారు పక్కన ఫోజులిచ్చిన చంద్రబాబు.. ఫోటోలు వైరల్ (video)

Anchor Shyamala: కర్నూలు బస్సు ప్రమాదం: 27 మంది వైఎస్‌ఆర్‌సిపి సభ్యులపై కేసు

AP: శ్రీశైలం నుండి విద్యుత్ కోసం తెలంగాణ వాటర్ తీసుకోవద్దు.. ఏపీ విజ్ఞప్తి

Krishna Water: సముద్రంలోకి 4.32 లక్షల క్యూసెక్కుల కృష్ణానది జలాలు

kasibugga stampede ఆ ఆలయం పండా అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments