Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఖిలాడీ డైరక్టర్.. WHO అనే టైటిల్‌ ఫిక్స్

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (21:14 IST)
Ramesh Varma
పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌... తెలుగు దర్శకుడితో చేతులు కలిపి పాన్ ఇండియా మూవీని తెరకెక్కించనుంది. రమేష్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. గ్రేట్ వీర, అభ్యత్ రాక్షసుడు, ఖిలాడీ వంటి సినిమాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం రమేష్ వర్మ బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడు. 
 
దేశంలోనే అతిపెద్ద ప్రొడక్షన్ కంపెనీ అయిన పూజా ఎంటర్‌టైన్మెంట్‌తో చేతులు కలపనున్నాడు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుకు ప్రస్తుతం WHO అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ కింద ప్రస్తుతం ఈ టీమ్ పనిచేస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు త్వరలో ప్రారంభం కానున్నాయి.  
 
ఈ సినిమాకు గాను ఈ సంవత్సరం భారీ డ్యాన్స్ బ్లాక్‌బస్టర్ పాట "ఊ అంటావా ఊ ఊ అంటావా"  (పుష్ప: ది రైజ్) కు సంగీతం సమకూర్చిన రాకింగ్ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. 
 
పూజా ఎంటర్‌టైన్‌మెంట్ 'WHO'ని 5 భాషలలో విడుదల చేయనున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రూపొందించి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా పాన్ ఇండియా జానర్‌లోకి అడుగుపెట్టింది. పూజా ఎంటర్‌టైన్‌మెంట్ గతంలో కూలీ నంబర్ 1, జవానీ జానేమాన్, బెల్ బాటమ్ వంటి కొన్ని పెద్ద హిట్‌లను బాలీవుడ్‌కు అందించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఎలాన్ మస్క్ ప్రచారం

మాజీ క్రికెటర్ సలీల్ అంకోలా తల్లి అనుమానాస్పద మృతి.. గొంతుకోసి చంపేశారు..

ముంచు కొస్తున్న భారీ సౌర తుఫాను ముప్పు..

ముంబైలోని చెంబూరులో విషాదం... షార్ట్ సర్క్యూట్‌తో ఏడుగురి సజీవదహనం

శ్రీవారి అన్నప్రసాదంలో జెర్రి... ఖండించిన తితిదే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments