Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో హైపర్ ఆది : ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (15:58 IST)
ప్రముఖ టీవీలో ప్రసారమయ్యే కామెడీ షో 'జబర్దస్త్' ఈ షో ద్వారా కమెడియన్‌‌గా గుర్తింపు పొందిన హైపర్ ఆది ఇపుడు చిక్కుల్లో పడ్డారు. ఆదిపై ఎల్బీనగర్‌ అసిస్టెంట్ పోలీస్ కమిషనరు శ్రీధర్‌ రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్‌ ఫెడరేషన్‌ సభ్యులు ఫిర్యాదు చేశారు. అందులో బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాషను కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఈ ఫిర్యాదులో ఆది, స్క్రిప్ట్‌ రైటర్‌, మల్లెమాల ప్రొడక్షన్‌ పేర్లను వారు ప్రస్తావించారు. ఫిర్యాదు చేసిన వారిలో తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్, సమాచార హక్కు సాధన స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్తీక్, టీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి చింత మహేశ్, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ తదితరులు ఉన్నారు. 
 
గతంలోనూ ఆదిపై మానవహక్కుల సంఘానికి (హెచ్‌ఆర్సీ) ఫిర్యాదులు అందాయి. తమ మనోభావాలను దెబ్బతీసేలా స్కిట్ చేశారని ఆరోపిస్తూ పలువురు అనాథ పిల్లలు, సినీ విమర్శకుడు కత్త మహేష్‌లు హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments