ఆ దర్శకుడు నీలి చిత్రాలు చూపించాడు... క్రికెటర్‌తో డేటింగ్ చేశా... పాయల్ ఘోష్

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (09:07 IST)
బాలీవుడ్, శాండిల్‌వుడ్ చిత్రపరిశ్రమలను డ్రగ్స్ వ్యవహారం ఓ కుదుపు కుదుపుతోంది. హిందీలో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, కన్నడంలో రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలు డ్రగ్స్ దందాలో ఇప్పటికే అరెస్టు అయివున్నారు. అయితే, ఈ వ్యవహారంల ఇలా ఉంటే.. సినీ నటి పాయల్ ఘోష్ ఇపుడు సంచలన ఆరోపణలు చేశారు. ఈఆర్డీ రోడ్డులో ఉండే ఓ డైరెక్టర్ తనను గదిలోకి తీసుకెళ్ళి నీలి చిత్రాలు చూపించాడని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
నిజానికి సినీ ఇండస్ట్రీలో ఉండే చాలా మంది సినీ ప్రముఖులు, వారి పిల్లలు మాదకద్రవ్యాలను వాడుతుంటారనే ప్రచారం ఉంది. అందుకే వారంతా చలాకీగా ఉంటారని చెబుతుంటారు. అయితే, ఈ డ్రగ్స్ వినియోగంతో పాటు.. క్యాస్టింగ్ కౌచ్ అంశాలపై నటి పాయల్ ఘోష్ స్పందిస్తూ, తాను కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. 
 
ఓ డైరెక్టర్ ఈఆర్డీ రోడ్‌లో కలిసిన వేళ, గదిలోకి తీసుకెళ్లి, నీలి చిత్రాన్ని చూపించాడని, తాను ఏ హీరోయిన్‌ను కలిసినా, ఇక్కడే ఎంజాయ్ చేస్తానని అతను చెప్పగా, తనకు ఒంట్లో బాగాలేదని చెప్పి తప్పించుకున్నానని వ్యాఖ్యానించింది. ఆపై మరే ఇతర డైరెక్టర్ నుంచి తనకు ఇదే విధమైన అనుభవం ఎదురు కాలేదని చెప్పుకొచ్చింది. 
 
ఇకపోతే, డ్రగ్స్ ప్రస్తావన వస్తే, తాను దూరంగా ఉంటానని చెప్పింది. సుశాంత్ కొన్ని సంవత్సరాలుగా తనకు తెలుసునని, అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడని భావించడం లేదని తెలిపింది. గతంలో ఓ క్రికెటర్‌తో డేటింగ్ చేశానని, అతనితో బ్రేకప్‌తో తీవ్ర మానసిక వేధన అనుభవించానని, సుదీర్ఘకాలం పాటు చికిత్స తర్వాత కోలుకున్నానని వ్యాఖ్యానించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments