Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అన్నయ్య' టైటిల్‌ను వాడుకోనున్న 'తమ్ముడు'

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (16:42 IST)
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దగ్గుబాట రానాలు కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. 
 
అయితే, మలయాళంలో పృథ్వీరాజ్, బిజూమీనన్ పోషించిన ప్రధాన పాత్రలను తెలుగు వెర్షన్‌లో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగును రెండు రోజుల క్రితం హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో పవన్ సరసన సాయిపల్లవి, రానా సరసన ఐశ్వర్య రాజేశ్ నాయికలుగా నటించే అవకాశం వుంది. 
 
ఇక చిత్రం టైటిల్ విషయానికి వస్తే.. 'బిల్లా రంగా' అనే పేరు బాగా వినిపిస్తోంది. చిత్రకథకు ఇది సరైన టైటిల్ అవుతుందని భావిస్తున్నారట. పవన్ కూడా దీనికి ఓకే చెప్పినట్టు చెబుతున్నారు. దీంతో దాదాపు దీనినే ఫైనల్ చేస్తారని సమాచారం.
 
కాగా, గత 1982లో 'బిల్లా రంగా' పేరుతో తెలుగులో ఓ చిత్రం వచ్చిన సంగతి తెల్సిందే. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. మంచి యాక్షన్ ఎంటర్ టైనర్‌గా అప్పట్లో అది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 
 
ఇపుడు ఈ తాజా చిత్రానికి కూడా ఈ టైటిల్ అయితే సరిగ్గా సూటవుతుందని భావించిన చిత్ర యూనిట్ ఆ టైటిల్ వైపు మొగ్గు చూపగా, హీరోలు కూడా సమ్మతించినట్టు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభంకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అన్నా ఒకసారి మోహం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments