Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిప్పి కొడితే 900 ఓట్లు కూడా లేవు.. వ్యక్తిగత దూషణలు అవసరమా?

Webdunia
ఆదివారం, 10 అక్టోబరు 2021 (10:51 IST)
‘మా’ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు సినీ తారలు ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూళ్లో మా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
 
‘మా’ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి ఓటు వేయడం విశేషం. ఇక ఓటు వేసిన అనంతరం పవన్ తనను కలిసిన ప్రకాష్ రాజ్, మంచు మనోజ్‌లను హగ్ చేసుకొని సరదాగా వారితో మాట్లాడారు. ఉల్లాసంగా కనిపించారు. తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకుని మొదటి ఓటును వేశారు. ఈ సందర్భంగా మా ఎన్నికలపై పవన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
 
తిప్పి కొడితే 900 ఓట్లు కూడా లేవు.. దీనికోసం వ్యక్తిగత దూషణలు అవసరమా అంటూ పవన్ ప్రశ్నించారు. సినిమాలు చేసే వాళ్లు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి కానీ.. ఇలాంటి వ్యక్తిగత దూషణలు ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయని తెలిపారు. ‘మా’ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ ఇలాంటి పోటీని చూడలేదని పవన్ తెలిపారు.
 
సినిమా ఇండస్ట్రీని చీల్చడం అనే సమస్యే ఉండదని తేల్చిచెప్పారు. ఇక మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి అన్న ప్రచారం జరుగుతుందన్న దానిపై పవన్ స్పందిస్తూ ‘వారిద్దరూ మంచి ఫ్రెండ్స్’ అని తెలిపారు. సినిమాలు చేసే వాళ్లు ఆదర్శంగా ఉండాలంటూ పవన్ చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కవితకు బెయిల్ పొడిగింపు

కౌంటింగ్ నేపథ్యంలో పిఠాపురంలో హింసకు ఛాన్స్ : నిఘా వర్గాల హెచ్చరిక!!

ప్రియురాలిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని బైక్‌పై ప్రియుడి స్టంట్స్... ఊచలు లెక్కబెట్టిస్తున్న పోలీసులు!!

పిఠాపురంలో పవన్‌కు కలిసొచ్చే ఆ సెంటిమెంట్?

దుస్తులు విప్పేసి బెంగుళూరు రేవ్ పార్టీ ఎంజాయ్... నేను లేనంటున్న నటి హేమ!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments