Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌ కల్యాణ్ పంజాలో విలన్‌గా చేయనన్నాను.. భల్లాలదేవుడి పుత్రుడిగా రాజమౌళి ఛాన్సిచ్చారు..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో విలన్‌గా నటించడం ఇష్టం లేదని చెప్పినట్లు నటుడు అడివి శేష్ అన్నాడు. కన్నడ దర్శకుడు విష్ణువర్ధన్, పవన్ కల్యాణ్ కాంబోలో పంజా సినిమా తీస్తున్నామని.. అందులో నటించమని ఆర్కా మీడియ

Webdunia
ఆదివారం, 18 జూన్ 2017 (14:37 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో విలన్‌గా నటించడం ఇష్టం లేదని చెప్పినట్లు నటుడు అడివి శేష్ అన్నాడు. కన్నడ దర్శకుడు విష్ణువర్ధన్, పవన్ కల్యాణ్ కాంబోలో పంజా సినిమా తీస్తున్నామని.. అందులో నటించమని ఆర్కా మీడియాకు చెందిన నీలిమా తిరుమలశెట్టి అడిగిందని, తన కజిన్ బ్రదర్ అడివి సాయికిరణ్‌తో అడిగి చెప్తానని నీలిమాతో చెప్పానని.. అతనితో విలన్‌గా నటించడం ఇష్టం లేదని చెప్పినట్లు అడివి శేష్ అన్నాడు. 
 
కానీ వెంటనే అన్నయ్య పవన్ కల్యాణ్‌తో నటించే అవకాశం వస్తే వదులుకోకు.. ఆయన సినిమాలను కోట్లాది మంది చూస్తారని.. వారందరికీ నువ్వు తెలిసిపోతావని సలహా ఇచ్చినట్లు అడివి శేష్ తెలిపాడు. అందుకే పంజాలో విలన్ ఛాన్సును వినియోగించుకున్నానని అడివి శేష్ వెల్లడించాడు. తొలిరోజు షూటింగ్‌‌లో బాలీవుడ్‌ నుంచి వచ్చాననుకుని పవన్‌ కళ్యాణ్‌ గారు తనను హిందీలో పలకరించారని చెప్పాడు.
 
కానీ తెలుగువాడినని తెలుసుకుని బాగా ఎంకరేజ్ చేశారన్నాడు. ఈ సినిమా విడుదలైన వెంటనే విలన్‌గా, విలన్ కొడుకుగా చెయ్యమంటూ చాలా ఆఫర్లు వచ్చాయని అన్నాడు. బాహుబలి సినిమాలో భల్లాలదేవుడి కుమారుడి పాత్రను రాజమౌళిగారు ఇవ్వడంతో హ్యాపీగా చేశానని అడివి శేష్ తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బెయిలా.. సుప్రీంలో ఏపీ సర్కారు అప్పీల్

ఉత్తర కాశీలో ప్రకృతి విలయం... ముగ్గురు మృతి.. 9 మంది గల్లంతు

న్యూస్ యాంకర్ స్వేచ్ఛ కేసులో కీలక మలుపు.. ఠాణాలో లొంగిపోయిన పూర్ణచందర్

శ్రీవారి భక్తులకు భద్రత.. ప్రతి భక్తుడికి బీమా సౌకర్యం... ఎలా?

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లొ దొంగల బీభత్సం... పోలీసుల కాల్పులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments