Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యప్పనుమ్ కోషియం రీమేక్.. షూటింగ్‌లతో పవన్ బిజీ

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (12:29 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల తరువాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. రాజకీయ అరంగేట్రం కారణంగా సినిమాలకు దూరమైన పవన్ మళ్లీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల పవన్ తన రాజకీయ పార్టీ సమావేశాల కారణంగా సినిమా షూటింగ్‌ల నుంచి బ్రేక్ తీసుకున్నారు. పవన్ కళ్యాన్ జనసేన నాయకులతో ఆంధ్రాలోని పొలిటికల్ టెన్సన్‌పై చర్చించారు.
 
అయితే తాజాగా తన సమావేశాలను ముగించుకొని పవర్ స్టార్ మళ్లీ సినిమా షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. బుధవారం నుంచి పవన్ తన తదుపరి సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియం రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఈ సినిమా రానా దగ్గుపాటి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ సరిహద్దుల్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అక్కడ రానా, పవన్ కాంబో సన్నివేశాలను రూపొందిస్తున్నారు. 
 
ఈ సినిమాను సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాన్ రీఎంట్రీ తరువాత చేసిన మొదటి సినిమా వకీల్‌సాబ్ ఏప్రిల్9న విడుదల కానుంది. ఆ తాలూకా హంగామా కూడా మొదలైంది. వకీల్‌సాబ్ నుంచి మరో పాట కూడా విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments