Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్రాయని సంగీతరావు ఇకలేరు.. కరోనాతో చెన్నైలో మృతి

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (08:07 IST)
ప్రముఖ సంగీత విద్వాంసుడు, ఘంటసాల స్వరసహచరుడు, ఆయన సంగీత గురువు పట్రాయని సీతారామ శాస్త్రి కుమారుడు పట్రాయని సంగీతరావు కన్నుమూశారు. 101 యేళ్ళ వయస్సులో కరోనా వైరస్ సోకడంతో ఆయన చెన్నైలో బుధవారం చనిపోయారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈయన అంత్యక్రియలు గురువారం జరుగనున్నాయి. 
 
కర్నాటక, హిందుస్థానీ సంగీతరీతుల్ని ఔపోషణ చేసిన పట్రాయని, హార్మోనియం, వీణ, వయోలిన్ వాయిద్యాల్లో మహాదిట్ట. ఆయన అసలు పేరు పట్రాయని వేంకట నరసింహమూర్తి. అయితే సంగీతజ్ఞుల కుటుంబానికి చెందిన తన బిడ్డ తప్పకుండా సంగీత విద్వాంసుడు అవుతాడన్న నమ్మకంత మాతృమూర్తి మంగమ్మ.. ఆయన్ను సంగీతరావు అని పిలిచవారు. తర్వాత ఆ పేరే ఆయనకు స్థిరపడింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి తాలూకా ఆనవరం ఆగ్రహారం సంగీతరావుది స్వస్థలం. విజయనగరం సంగీత కాలేజీలో 1938లో ఘంటసాల - సంగీతరావుకు మధ్య స్నేహం కుదిరింది. ఘంటసాల తీసిన పరోపకారి చిత్రంలో పదండి తోసుకు పదండి ముందుకు అనే పాటను పట్రాయనే పాడారు. 
 
అనేక కూచిపూడి నాటకాలకు సంగీతం అందించారు. 1956 నుంచి 1982 వరకు ఘంటసాల కుటుంబంలోనే పట్రాయని కుటుంబం ఉండేది. ఏపీ ప్రభుత్వం ఘంటసాల పురస్కారంతో సత్కరించగా, తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డుతో సత్కరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం!!

Pawan Kalyan: తిరుమలలో చాలా అనర్థాలు.. మద్యం మత్తులో పోలీసులు.. పవనానంద ఏం చేస్తున్నారు?

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments