మాస్ హీరోగా విశాల్ - ఎన్.లింగుస్వామి కాంబినేషన్లో వచ్చిన చిత్రం పందెంకోడి-2. ఈ చిత్రం పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. లైట్హౌస్ మూవీ మేకర్స్ ఎల్ఎల్పి పతాకంపై 'ఠాగూర్' మధు సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతి లాల్ గడా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రం దసరా కానుకగా ఈనెల 18వ తేదీన విడుదలై సూపర్ ఓపెనింగ్స్తో సెన్సేషనల్ హిట్ సాధించింది. 'అభిమన్యుడు' తర్వాత తెలుగులో మాస్ హీరో విశాల్కి మరో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ట్రెమండస్ ఓపెనింగ్స్తో అన్ని ఏరియాల్లో సూపర్హిట్ టాక్తో చిత్రం ప్రదర్శితమవుతోంది.
ఈ చిత్రాన్ని రూ.6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా, కేవలం 3 రోజుల్లోనే రూ.4 కోట్ల 21 లక్షల 33 వేల 402లు షేర్ సాధించినట్టు చిత్ర నిర్మాత వెల్లడించారు. 'పందెంకోడి'తో పెద్ద హిట్ సాధించిన విశాల్కి ఇప్పుడు 'పందెంకోడి-2' మరో సూపర్హిట్ చిత్రం అయింది. ఈ ఘనవిజయానికి కారకులైన ప్రేక్షకులకు చిత్ర సమర్పకులు ఠాగూర్ మధు కృతజ్ఞతలు తెలిపారు.