Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్-రానా కాంబినేషన్‌లో మల్టీస్టారర్.. దర్శకుడు ఎవరంటే?

టాలీవుడ్‌లో ఓ వైపు బయోపిక్‌లు.. మరోవైపు మల్టీస్టారర్ మూవీలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్-రామ్ చరణ్, వెంకటేష్-వరుణ్ తేజ్, నాగార్జున-నాని కాంబోలో మల్టీస్టారర్ సినిమాలు రూపుదిద్దుకోనున్నాయి.

Webdunia
బుధవారం, 4 జులై 2018 (17:32 IST)
టాలీవుడ్‌లో ఓ వైపు బయోపిక్‌లు.. మరోవైపు మల్టీస్టారర్ మూవీలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్-రామ్ చరణ్, వెంకటేష్-వరుణ్ తేజ్, నాగార్జున-నాని కాంబోలో మల్టీస్టారర్ సినిమాలు రూపుదిద్దుకోనున్నాయి. 
 
తాజాగా బాహుబలిలో నాయకుడు, ప్రతినాయకుడిగా కనిపించి ప్రపంచ  వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రభాస్, రానా ప్రస్తుతం ఓ మల్టీస్టారర్ సినిమాలో కలిసి నటించబోతున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
 
సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల పేర్లు వినగానే దర్శకుడు దశరథ్ పేరు గుర్తుకు వస్తుంది. లవ్, ఫ్యామిలీ డ్రామాతో కూడిన సూపర్ కథతో సినిమాలను రూపొందించడంలో అతడు దిట్ట. 
 
అలాంటి సూపర్ దర్శకుడు కొత్తగా ఓ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడని, ఆ సినిమాలో ప్రభాస్, రానా కలిసి నటిస్తారని తెలుస్తోంది. ఇందుకోసం రానా, ప్రభాస్‌‍లను దశరథ్ కలిసేందుకు సిద్ధంగా వున్నట్లు సమాచారం. మరి ఈ కాంబోలో సినిమా పట్టాలెక్కుతుందో లేదో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments