Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈనెల 25న "ఓం నమో వేంకటేశాయ" చిత్ర నిర్మాణం ప్రారంభం : సినీనటుడు నాగార్జున

Webdunia
గురువారం, 23 జూన్ 2016 (13:05 IST)
ఈనెల 25వ తేదీన హైదరాబాద్‌లో "ఓం నమో వేంకటేశాయ" చిత్ర నిర్మాణం ప్రారంభమవుతుందని ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున వెల్లడించారు. ఈ చిత్రం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వస్తున్న మరో గొప్ప ఆధ్యాత్మిక చిత్రం ఇదేనన్నారు. అన్నమయ్య తర్వాత శ్రీవారి పేరు మీద మరో సినిమా తీస్తుండడం ఎంతో సంతోషంగా ఉందని నాగార్జున అన్నారు. 
 
తిరుమల శ్రీవారి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో కలిసి హీరో నాగార్జున దర్శించుకున్నారు. అలాగే 'ఓం నమోవేంకటేశాయ' చిత్రంలో నటించే చిత్ర బృందంలోని సభ్యులు కూడా స్వామివారికి వీఐపీ విరామ దర్శన సమయంలో దర్శించుకున్నారు. 
 
ఆలయం వెలుపల రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఎప్పటి నుంచో 'ఓం నమో వేంకటేశాయ' చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నానని, అయితే సమయం దొరక్కపోవడం వల్ల, నాగార్జునకు బిజీ షెడ్యూల్‌ ఉండటం వల్ల చిత్రీకరించపోయామని చెప్పారు. ఈనెల 25వ తేదీన ఘూటింగ్‌ ప్రారంభించి కంటిన్యూగా సినిమాను తీస్తామన్నారు. ఈ సినిమాలో వెంకటేశ్వరస్వామిగా మహాభారత్‌లో శ్రీకృష్ణుడి పాత్రధారి స్వభావ్‌ జైన్‌ నటించనున్నట్లు రాఘవేంద్ర రావు వెల్లడించారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments