Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ సాంగ్: పాటని సిద్ధం చేసే పనిలో దేవీశ్రీ ప్రసాద్!

Webdunia
గురువారం, 26 నవంబరు 2015 (14:36 IST)
ఎన్‌.టి.ఆర్‌ నటిస్తున్న 25వ సినిమా 'నాన్నకు ప్రేమతో' షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్ర టీం ఫైనల్‌ షెడ్యూల్‌ కోసం స్పెయిన్‌ వెళ్లనున్నారు. కాగా, ఎన్‌.టి.ఆర్‌ నటుడిగానే కాకుండా తనకున్న మక్కువతో ఇప్పటికే తన సినిమాలలో ఓ నాలుగు పాటలు పాడాడు. యమదొంగలో 'ఓలమ్మి తిక్కరేగిందా', కంత్రిలో '123 నేనొక కంత్రి', అదుర్స్‌లో 'చారి', రభసలో 'రాకాసి రాకాసి' పాటలను పాడాడు. ఈ నాలుగు సాంగ్స్‌ అప్పట్లో చార్ట్‌ బస్టర్స్‌గా నిలిచాయి.
 
ఇదే కోవలోనే ఎన్‌.టి.ఆర్‌ నాన్నకు ప్రేమతో సినిమాలో కూడా ఓ పాటని పాడటానికి సిద్దమయ్యాడు. ఇటీవలే దేవీశ్రీ ప్రసాద్‌ ఎన్‌.టి.ఆర్‌‌ని కలిసి ఓ పాట ఆయన పాడితే బాగుంటుందని అప్రోచ్‌ అయితే ఎన్‌.టి.ఆర్‌ కూడా దానికి సుముఖత చూపినట్లు సమాచారం. దాంతో దేవీశ్రీ ప్రసాద్‌ ఫుల్‌ ట్యూన్‌, పాటని సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. ఆ పాట రెడీ అయ్యాక ఎన్‌.టి.ఆర్‌ ఆ పాటని పాడనున్నారు.
 
ఎన్‌.టి.ఆర్‌ తన 25వ సినిమా ద్వారా మరోసారి సింగర్‌గా కూడా అభిమానులను మెప్పించనున్నాడు. సుకుమార్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. డిసెంబర్‌ 3వ వారం కల్లా సినిమా షూటింగ్‌ పూర్తిచేసి సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్‌ చేయనున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments