Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్.. మళ్లీ వాయిదా...

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (19:33 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". ఈ చిత్రం తొలి భాగం 'కథానాయకుడు'. సంక్రాంతికి రిలీజైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
 
ఈ చిత్రం రెండో భాగమైన 'మహానాయకుడు' కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. వాస్తవానికి ఈ చిత్రం ఫిబ్రవరి ఏడో తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ, కారణాలు తెలియవు కానీ వాయిదా వేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 14వ తేదీ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఇపుడు మళ్లీ ఈ విడుదల తేదీని వాయిదా వేశారు. ఈ మలి భాగం మహాశివరాత్రి సందర్భంగా విడుదల కానుందట.
 
తాజా సమాచారం ప్రకారం మహాశివరాత్రి కానుకగా రెండో భాగాన్ని విడుదల చేయనున్నారని తెలిసింది. ఫిబ్రవరి 28 లేదా మార్చి 1న కానీ రెండో భాగం రిలీజ్ కావచ్చని సమాచారం. మరి రెండో భాగమైనా కమర్షియల్‌గా మెప్పిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. ఈ చిత్రాన్ని హీరో బాలకృష్ణ తన సొంత బ్యానర్ ఎన్.బి.కె ఫిలిమ్స్ పతాకంపై నిర్మించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments