Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్.. మళ్లీ వాయిదా...

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (19:33 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". ఈ చిత్రం తొలి భాగం 'కథానాయకుడు'. సంక్రాంతికి రిలీజైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
 
ఈ చిత్రం రెండో భాగమైన 'మహానాయకుడు' కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. వాస్తవానికి ఈ చిత్రం ఫిబ్రవరి ఏడో తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ, కారణాలు తెలియవు కానీ వాయిదా వేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 14వ తేదీ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఇపుడు మళ్లీ ఈ విడుదల తేదీని వాయిదా వేశారు. ఈ మలి భాగం మహాశివరాత్రి సందర్భంగా విడుదల కానుందట.
 
తాజా సమాచారం ప్రకారం మహాశివరాత్రి కానుకగా రెండో భాగాన్ని విడుదల చేయనున్నారని తెలిసింది. ఫిబ్రవరి 28 లేదా మార్చి 1న కానీ రెండో భాగం రిలీజ్ కావచ్చని సమాచారం. మరి రెండో భాగమైనా కమర్షియల్‌గా మెప్పిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. ఈ చిత్రాన్ని హీరో బాలకృష్ణ తన సొంత బ్యానర్ ఎన్.బి.కె ఫిలిమ్స్ పతాకంపై నిర్మించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments