Webdunia - Bharat's app for daily news and videos

Install App

"జై లవ కుశ" పాటలు రిలీజ్ (Audio)

జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్‌లో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం "జై లవ కుశ". బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పత

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (06:26 IST)
జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్‌లో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం "జై లవ కుశ". బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై మరో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
అయితే, ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఎన్టీఆర్ మూడు లుక్స్ విడుద‌ల చేసి అభిమానుల‌లో సినిమాపై భారీ అంచ‌నాలు పెంచిన టీం తాజాగా దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత సార‌థ్యంలో రూపొందిన ఆడియోను విడుద‌ల చేసింది. 
 
అలాగే, ఈనెల 10వ తేదీన అభిమానుల కోసం ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. అదేరోజు ఈ చిత్ర ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల కానుంది. 
 
ఈ మూవీలో 'జై, ల‌వ‌, కుశ' అనే పాత్ర‌ల‌లో ఎన్టీఆర్ కనిపించ‌నుండగా ఆయ‌న స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా న‌టించారు. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఐటెం సాంగ్‌తో అల‌రించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రంలోని పాటలను మీరూ వినండి. 
 

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments