Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపదలో ఉన్న అభిమానికి ఫోన్ చేసి మాట ఇచ్చిన ఎన్టీఆర్

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (13:28 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అభిమానులు ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటారు. తన సినిమా ఫంక్షన్‌కి వచ్చిన అభిమానులు క్షేమంగా ఇంటికి వెళ్లాలని పదేపదే చెబుతుంటారు. తన కుటుంబంలో జరిగినట్టుగా వేరే ఎవరి కుటుంబంలో ప్రమాదం జరగకూడదని చెబుతుంటారు. ఎల్లప్పుడూ అభిమానుల క్షేమాన్ని కాంక్షించే ఎన్టీఆర్ తాజాగా తన వీరాభిమాని వెంకన్న తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ తనను కలవడానికి ఎదురుచూస్తున్నాడని తెలుసుకున్నారు ఎన్టీఆర్ ఈ విషయం తెలిసిన వెంటనే ఎన్టీఆర్ అతనితో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు.
 
ఎన్టీఆర్‌తో వెంకన్న మాట్లాడుతూ.... నాకు మీతో సెల్ఫీ దిగాలని ఉందన్నా అని అడగ్గానే తారక్ ఈ కరోనా గొడవ తగ్గాక ఖచ్చితంగా కలుద్దామని అన్నారు. ఇంతలో అభిమాని మిమ్మల్ని కలవడానికైనా బ్రతుకుతాను అనగానే నీకు ఏం కాదు.. నాకు ఏం కాదు... తప్పకుండా కలుస్తాను, మంచి ఫోటో దిగుదాం. నువ్వు మాత్రం బాగా తిని సంతోషంగా ఉండు. వెంకన్న తల్లికి, తనకు వీలైన సహాయం తప్పకుండా చేస్తానని మాటిచ్చారు.
 
తారక్ నేరుగా ఫోన్ చేసి మరీ మాట్లాడటంతో వెంకన్న ఆనందానికి అవధులు లేవు. తారక్ చేసిన ఈ మంచి పని గురించి తెలుసుకున్న అభిమానులు ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఎన్టీఆర్ అభిమాని త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజాకు ప్రాణాపాయం తప్పింది - ఎలాగో చూడండి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments