Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాటపర్వం సెట్లోకి ఎంటరైన నివేత పేతురాజ్.. మూడో హీరోయిన్ రెడీ

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (20:34 IST)
రానా, సాయిపల్లవి జంటగా విరాటపర్వం సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ సినిమా ఆగిపోయింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా నీదీ నాదీ ఒకే కథ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందులో నటి ప్రియమణి కీలక పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు సమర్పణలో ఎస్ ఎల్ వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 
 
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం నివేత పేతురాజ్‌ను ఎంపిక చేశారు. నివేత తెలుగులోనే కాకుండా తమిళంలోనూ వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నారు. 
 
అయితే ప్రస్తుతం నివేత విరాట పర్వం సెట్స్‌లోకి ఎంటర్ అయిపోయారు. ఈ సినిమాలోని లీడ్ రోల్స్ ఇంతకు ముండు నటించన వారే కనిపించనున్నారు. ఈ చిత్రం నెక్సలైట్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతోంది. ఇందులో రానా, సాయి పల్లవి ఉద్యమకారులుగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాపై అభిమానులు అంచాలు బాగానే పెట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments