Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌ర్మ‌కు షాక్ ఇచ్చిన నితిన్..!

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (15:25 IST)
వ‌ర్మ‌కు నితిన్ షాక్ ఇవ్వ‌డం ఏంటి..? అస‌లు ఏమైంది..? అనుకుంటున్నారా..?  విష‌యం ఏంటంటే... యువ హీరో నితిన్ ఇటీవ‌ల కాలంలో వ‌రుస‌గా ఫ్లాప్స్‌తో స‌త‌మ‌త‌మౌతున్నాడు. దీంతో ఈసారి ఎలాగైనా స‌రే... విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. ఛ‌లో ఫేమ్ వెంకీ కుడుముల‌తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని ఎనౌన్స్ చేసి చాలా రోజులు అయ్యింది కానీ.. ఇప్ప‌టివ‌ర‌కు సెట్స్ పైకి వెళ్ల‌లేదు. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే... విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు చంద్రశేఖర్ యేలేటితో  సినిమా చేయనున్నాని ట్వీట్ చేశాడు నితిన్. అయితే అదే రోజు రైడ్ ఫేమ్ రమేష్ వర్మతో కూడా ఓ సినిమా చేయనున్నాడని... ఆగస్టులో ఈ చిత్రం ప్రారంభం కానుందని ప్రకటన వచ్చింది. అయితే దీనిపై నితిన్ స్పందించకపోవడంతో అస‌లు ఈ సినిమా ఉందా..? లేదా..? ఉంటే నితిన్ ఎందుకు ట్వీట్ చేయ‌లేదు అని ఆయన ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు.
 
ఈ న్యూస్ కాస్త వైరల్ అవ్వ‌డంతో నితిన్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ఇంత‌కీ ఏమ‌న్నాడంటే... నేను చేయబోయే సినిమాల గురించి నా సోషల్ మీడియా ద్వారా అప్‌డేట్ ఇస్తాను. ఫేక్ న్యూస్ నమ్మకండి అని ఆయన తాజాగా ట్వీట్ చేసి ర‌మేష్ వ‌ర్మ‌కు షాక్ ఇచ్చాడు. అదీ.. సంగ‌తి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments