Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ఠాగూర్
సోమవారం, 11 ఆగస్టు 2025 (22:43 IST)
ఇటీవల భీమవరంలో జరిగిన ఈ కమర్షియల్ ఈవెంట్‌కు ఏపీ ప్రభుత్వ వాహనంలో రావడం వెనుక తన ప్రమేయం ఏమీ లేదని, నిర్వాహకులు ఏర్పాటు చేసిన వాహనంలో మాత్రమే ప్రయాణించానని హీరోయిన్ నిధి అగర్వాల్ స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ బోర్డు ఉన్న వాహనంలో ఆమె కనిపించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. 
 
ప్రభుత్వం తరపున విధులు నిర్వహించే అధికారులు, నాయకులకు మాత్రమే ఆ వాహనాలను వాడుకునే అవకాశం ఉంటుంది. అధికారులెవరూ తమ సొంత పనుల కోసం వాటిని వాడుకోవడానికి వీల్లేదు. కానీ, ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేని హీరోయిన్ ప్రభుత్వ అధికారిక వాహనంలో ఉన్న వీడియో బయటకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. దీనిపై నిధి అగర్వాల్ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు.
 
"ఇటీవల భీమవరంలో ఓ స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా జరిగిన పరిణామాలపై సోషల్ మీడియా ప్రచారమవుతున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. ఈ విషయంలో నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఈవెంట్ నిర్వాహకులు నా కోసం రవాణా సదుపాయం కల్పించిన వాహనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిది. దానిని ఏర్పాటు చేసే విషయంలో నా పాత్ర లేదు. 
 
ప్రభుత్వ అధికారులే నా కోసం వాహనాన్ని పంపినట్లు కొన్ని వార్తలు నా దృష్టికి వచ్చాయి. అవన్నీ నిరాధారమైనవి. ఈ విషయంలో నాకెలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ అధికారులెవరూ నా కోసం ఎలాంటి వాహనం ప్రత్యేకంగా పంపలేదు. నా ప్రియమైన అభిమానులకు వాస్తవాలను చెప్పడం నా బాధ్యత. ప్రతి విషయంలోనూ ప్రేమ, సహకారం అందిస్తున్న నా అభిమానులకు కృతజ్ఞతలు' అంటూ పేర్కొన్నారు. 
 
ఇక నిధి అగర్వాల్ సినిమాల విషయానికొస్తే, ఇటీవల పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన "హరి హర వీరమల్లు"లో కథానాయికగా నటించి మెప్పించారు. ప్రభాస్ కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న "ది రాజాసా"బ్‌లోనూ నిధి అగర్వాల్ నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

leopard: తల్లిదండ్రులతో నిద్రస్తున్న మూడేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే?

Chandra Babu: నారావారిపల్లెకు స్కోచ్ అవార్డు లభించింది: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

వివాహేతర సంబంధం.. 35 ఏళ్ల వ్యక్తిని భార్య, ప్రియుడు, సహచరుడు గొంతుకోసి చంపేశారు..

ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధించిన కోర్టు

Nellore: భారీ వర్ష హెచ్చరికలు.. నెల్లూరు ప్రజలకు అలెర్ట్ - చేపల వేటకు వెళ్ళొద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments