Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కినేని అన్నదమ్ములతో ఒకేసారి కలిసి నటిస్తున్న భామ ఎవరో తెలుసా?

Webdunia
మంగళవారం, 30 అక్టోబరు 2018 (17:38 IST)
అక్కినేని నాగార్జున కుమారులు నాగచైతన్య, అఖిల్ నటిస్తున్న వేర్వేరు సినిమాలలో ఒకే భామ ఇరువురికి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె పేరు నిధి అగర్వాల్. గతేడాది మున్నా మైఖేల్ చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన హిందీలో పరిచయమైంది. ఈ ఏడాది తెలుగు తెరకు కూడా పరిచయం కానుంది. తాజాగా నాగచైతన్య నటిస్తున్న 'సవ్యసాచి' చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 2వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఇందులో తమిళ నటుడు మాధవన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న నిధి అగర్వాల్ చైతూ తమ్ముడు అఖిల్‌తో పాటు 'మిస్టర్ మజ్ను' చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
ఒకేసారి ఇద్దరి అన్నదమ్ముల చిత్రాలలో నటించడం ప్రత్యేకమని, అలాగే ఈ అనుభూతి ఏ కొందరికి మాత్రమే లభిస్తుందని, రెండు చిత్రాలలోని కథనం దేనికదే ప్రత్యేకమని, ఒకేసారి రెండు చిత్రాల్లో నటించడం తనకు సవాలుగా మారిందంటూనే తాను మంచి నటిగా నిరూపించుకునేందుకు ఈ రెండు చిత్రాలు ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు ఆమె సవ్యసాచి చిత్ర ప్రమోషన్‌లో భాగంగా చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments