Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈరోజు కొత్త అధ్యాయం అంటోన్న కీర్తి సురేశ్‌ (video)

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (16:25 IST)
త‌న‌కు ఈరోజు చాలా కొత్త‌రోజుగా వుంద‌ని.. న‌టి కీర్తి సురేష్ తెలియ‌జేసింది.  సూపర్ స్టార్ మహేష్ బాబు ,  పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న 'సర్కారు వారి పాట` సినిమా దుబాయ్‌లో ప్రారంభ‌మైన సంద‌ర్భంగా సోమ‌వారంనాడు కీర్తి సంతోషంతో ట్వీట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు వంటి ప్రెస్టీజియస్ వేన‌ర్‌లో న‌టించ‌డం ఆనందంగా వుంద‌ని చెబుతూ... ``కొత్త రోజు. కొత్త ప్రయాణం. కొత్త అధ్యాయం` ఆరంభ‌మైంద‌ని తెలియ‌జేసింది.
 
అంతేకాకుండా ఈరోజు సూప‌ర్ ఎక్స‌యిట్‌మెంట్‌తో వున్నాన‌ని అంటోంది.  ఇదేరోజు ద‌ర్శ‌కుడు కూడా `ఇన్నేళ్ళ నా క‌ల ఈ రోజు నిజ‌మైంది. మహేష్ బాబు గారితో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది.  ఈ మూవీని ఒక ఛాలెంజింగ్ తీసుకుని చేస్తున్నాను` అని తెలియ‌జేశారు.

ఆ వెంట‌నే కీర్తి ట్వీట్ చేయ‌డం విశేషం.  అయితే తాను విమానంలో ప్ర‌యాణించే పిక్‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. `మ‌హాన‌టి` త‌ర్వాత కీర్తి, నితిన్‌తో `రంగ్‌దే`లో కూడా న‌టించింది. ఇప్పుడు మ‌హేశ్‌బాబుతో న‌టించ‌డం, పాట‌లో పాల్గొన‌డం.. త‌న‌కెంతో థ్రిల్ క‌లిగిస్తోంద‌ని చెబుతోంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్.. పండగ చేసుకుంటోన్న పవన్ ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన విజయసాయి రెడ్డి

తల్లి స్థానం దేవుడి కంటే గొప్పది : ప్రధాని నరేంద్ర మోడీ

మీరు కోట్లాది మందికి మార్గదర్శకుడిగా ఉండాలి : ఇట్లు.. మీ తమ్ముడు

థ్యాంక్యూ చిన్నన్నయ్యా.. మీరిచ్చిన పుస్తకమే రాజకీయ చైతన్యం కలిగించింది : పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments