Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కేసు.. ఇద్దరు అరెస్ట్.. వాళ్లెవరంటే?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (18:26 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో తొలి అరెస్టు చోటుచేసుకుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి కేసును సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రియాను పలుమార్లు ప్రశ్నించిన సీబీఐ, తొలిసారిగా ఆమె తల్లితండ్రులు ఇంద్రజిత్‌ చక్రవర్తి, సంధ్యలను సుమారు ఎనిమిది గంటల పాటు విచారించారు.
 
ఈ కేసులో మాదక ద్రవ్యాల కోణం ఉందనే అంశానికి సంబంధించి.. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. వారిలో ఒకరైన అబ్దుల్‌ బాసిత్‌ పరిహార్‌ను తాము ముంబయిలోని బాంద్రాలో అరెస్టు చేసినట్టు సంస్థ తెలిపింది. బాసిత్‌కు సుశాంత్ మేనేజర్ సామ్యూల్ మిరాండాతో సంబంధాలున్నట్టు తెలిసిందే. 
 
మిరాండా, రియా చక్రవర్తి సోదరుడు షోవిక్‌ చక్రవర్తి సూచనల మేరకు మాదక ద్రవ్యాలను సేకరించినట్టు తమకు సమాచారం ఉందని ఎన్‌సీబీ తెలిపింది. సుశాంత్‌ మాజీ మేనేజర్ మిరాండాను రియా చక్రవర్తి గత సంవత్సరం మే నెలలో నియమించారు. ఆయన సుశాంత్‌ ఇంటి నిర్వహణ, ఖర్చులు తదితర అన్ని వ్యవహారాలు చూసుకునేవారు. ఈయనపై సుశాంత్ కుటుంబ సభ్యులు డ్రగ్స్‌ సరఫరా చేయటం, సుశాంత్‌ డబ్బును భారీగా దుర్వినియోగం చేయటం వంటి ఆరోపణలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Heavy Rains: కేరళలో రోజంతా భారీ వర్షాలు.. పెరిగిన జలాశయాలు.. వరదలు

Vana Durgamma: భారీ వరదలు.. నీట మునిగిన ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అల్పపీడన ప్రభావం- తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments