Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కేసు.. ఇద్దరు అరెస్ట్.. వాళ్లెవరంటే?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (18:26 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో తొలి అరెస్టు చోటుచేసుకుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి కేసును సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రియాను పలుమార్లు ప్రశ్నించిన సీబీఐ, తొలిసారిగా ఆమె తల్లితండ్రులు ఇంద్రజిత్‌ చక్రవర్తి, సంధ్యలను సుమారు ఎనిమిది గంటల పాటు విచారించారు.
 
ఈ కేసులో మాదక ద్రవ్యాల కోణం ఉందనే అంశానికి సంబంధించి.. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. వారిలో ఒకరైన అబ్దుల్‌ బాసిత్‌ పరిహార్‌ను తాము ముంబయిలోని బాంద్రాలో అరెస్టు చేసినట్టు సంస్థ తెలిపింది. బాసిత్‌కు సుశాంత్ మేనేజర్ సామ్యూల్ మిరాండాతో సంబంధాలున్నట్టు తెలిసిందే. 
 
మిరాండా, రియా చక్రవర్తి సోదరుడు షోవిక్‌ చక్రవర్తి సూచనల మేరకు మాదక ద్రవ్యాలను సేకరించినట్టు తమకు సమాచారం ఉందని ఎన్‌సీబీ తెలిపింది. సుశాంత్‌ మాజీ మేనేజర్ మిరాండాను రియా చక్రవర్తి గత సంవత్సరం మే నెలలో నియమించారు. ఆయన సుశాంత్‌ ఇంటి నిర్వహణ, ఖర్చులు తదితర అన్ని వ్యవహారాలు చూసుకునేవారు. ఈయనపై సుశాంత్ కుటుంబ సభ్యులు డ్రగ్స్‌ సరఫరా చేయటం, సుశాంత్‌ డబ్బును భారీగా దుర్వినియోగం చేయటం వంటి ఆరోపణలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న భార్యలు-ఒక రోజు భర్తకు సెలవు!

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments