Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మానాన్నలైన నయనతార - విఘ్నేష్ శివన్

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (19:54 IST)
హీరోయిన్ నయనతార - కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌లు మమ్మీడాడీలు అయ్యారు. వీరికి పండంటి మగబిడ్డలు జన్మించారు. గత జూన్ నెల 9వ తేదీన మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట కేవలం నాలుగు నెలల్లోనే తల్లిదండ్రులు అయ్యారు. ఇదే విషయంపై విఘ్నేష్ శివన్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"నయనతార, నేను అమ్మానాన్నలమయ్యాం. మాకు కవల పిల్లలు జన్మించారు. ప్రార్థనలు, పూర్వీకుల ఆశీర్వాదాలు, ఈ శుభ విషయాలన్నీ కలిసి దేవుడు మాకు జంట పిల్లలను ప్రసాహించారు. మా ప్రాణానికి, ప్రపంచానికి మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి" అని పేర్కొన్నారు. 
 
అయితే, నయనతార ప్రెగ్నెన్సీ కూడా కాలేదు కదా అనుకుంటున్నారా..? సరోగసి పద్ధతిలో విగ్నేష్ శివన్, నయనతార అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. ఈ జంటకు ఇద్దరూ మగ బిడ్డలు పుట్టారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. తను నయనతార ఇద్దరు అబ్బాయిలకు పేరెంట్స్ అయ్యామని చెప్పుకొచ్చాడు. 
 
తమ జీవితంలో ఇది ఒక కొత్త చాప్టర్ అంటూ రాసుకొచ్చాడు విగ్నేష్. ఈ మూమెంట్ చాలా ఆనందంగా ఉందని.. నయనతార కూడా ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పాడు ఈ దర్శకుడు. తమ ఇద్దరు పిల్లల పాదాలకు ముద్దు పెడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విగ్నేష్ శివన్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments