'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రొమో వీడియోలో మోడీని కూడా వదల్లేదు...

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (15:35 IST)
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్''. ఈ చిత్రంలో ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం మిగిలిపోయిన షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవితంలో ఎన్టీఆర్‌గా ప్రమఖ రంగస్థల నటుడు విజయ్‌ కుమార్‌ నటిస్తున్నారు. అలాగే, లక్ష్మీపార్వతిగా యజ్ఞాశెట్టి కనిపించనుంది. 
 
కల్యాణీ మాలిక్‌ సంగీతం అందించిన ఈ సినిమా మార్చి 22వ తేదీ విడుదలకు సిద్ధం అవుతుండగా సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను వేగంగా  జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రచార చిత్రాలను, ట్రైలర్‌లను విడుదల చేసిన వర్మ.. ప్రమోషన్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వీడియో ప్రోమోను దర్శకుడు వర్మ విడుదల చేశాడు. 
 
'ఎన్టీఆర్ స్వయంగా చంద్రబాబు తనను ఎలా వెన్నుపోటు పొడిచారో చెప్పాడు' అంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకం ఆధారంగా అప్పటి ఎన్టీఆర్ వ్యాఖ్యలను వీడియో రూపంలో తయారు చేసి రాంగోపాల్ వర్మ విడుదల చేశారు.
 
'చంద్రబాబు వెన్నుపోటు పొడిచింది నాకు కాదు.. నాకు అధికారం ఇచ్చిన మీకు' అంటూ ప్రజలతో ఎన్టీఆర్ తన ఆవేదనను పంచుకున్న వీడియోని రాంగోపాల్ వర్మ విడుదల చేశారు. 'ప్రజాస్వామ్యం బాగుండాలంటే ఎవరికి ఓటేయాలి' అనే విషయాన్ని ఎన్టీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారని వర్మ తన వీడియోలో ఎన్టీఆర్ సందేశంగా వినిపించారు. 
 
అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చంద్రబాబును ఉద్దేశించి 'నువ్వే మామకు వెన్నుపోటు పొడవటంలో సీనియర్' అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రోమోలో ఉంచారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments