Webdunia - Bharat's app for daily news and videos

Install App

తారకరత్న విషయంలో మిరాకిల్ జరిగింది.. హీరో బాలకృష్ణ

Webdunia
ఆదివారం, 29 జనవరి 2023 (13:55 IST)
హీరో నందమూరి తారకరత్న విషయంలో మిరాకిల్ జరిగిందని నటుడు బాలకృష్ణ అన్నారు. నారా లోకేశ్ యువగళం యాత్రలో తీవ్ర అస్వస్థతకు లోనైన తారకరత్న ప్రస్తుతం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఎక్మోపై చికిత్స అందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌, బాలకృష్ణలు ఆదివారం తన కుటుంబ సభ్యులతో ఆస్పత్రికి వెళ్లి తారకరత్నను చూశారు. 
 
ఆ తర్వాత ఆస్పత్రి వద్ద బాలయ్య విలేకరులతో మాట్లాడుతూ, తారకరత్న విషయంలో మిరాకిల్ జరిగిందన్నారు. తొలుత ఆయన గుండె ఆగిపోయిందని, ఆ తర్వాత తిరిగి కొట్టుకోవడం ప్రారంభించిందని చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. అభిమానుల దీవెనలు, ప్రార్థనలతో త్వరలోనే కోలుకుంటాడని చెప్పారు. మరింత పురోగతి కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. 
 
ప్రస్తుతం కుప్పం తీసుకొచ్చినపుడు ఉన్నట్టుగానే తారకరత్న ఆరోగ్య పసిస్థితి ఉందని ఆయన తెలిపారు. వైద్యులు అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. అంతర్గత రక్తస్రావం కారణంగా తారకరత్నకు స్టెంట్ వేయడం కుదరలేదని చెప్పారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై ఉన్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments