Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీరియస్ అయిన నాగార్జున.. కొండా సురేఖపై పరువు నష్టం దావా

సెల్వి
గురువారం, 3 అక్టోబరు 2024 (19:11 IST)
తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన కుటుంబం పరువు, ప్రతిష్టకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను పేర్కొంటూ సినీనటుడు నాగార్జున అక్కినేని నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుల విడాకుల విషయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. 
 
ఈ ఆరోపణలను నాగార్జున, అతని కుటుంబం, సమంతలు తీవ్రంగా తిరస్కరించారు. అందరూ వాటిని నిరాధారమైనవని ఖండించారు. కేటీఆర్ ఈ వ్యాఖ్యలను ఆమె ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సురేఖపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నారు. 
 
దీంతో ఈ కామెంట్లను ఉపసంహరించుకున్నప్పటికీ, అక్కినేని కుటుంబం చట్టపరమైన చర్యలతో ముందుకెళ్తోంది. ఈ మేరకు సురేఖకు నోటీసు జారీ చేసింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వారి తరపున ప్రత్యేక నోటీసును కూడా రూపొందించింది. 
 
సురేఖ చేసిన షాకింగ్ వాదనలలో నాగార్జున ఎన్-కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతను ఆపడానికి బదులుగా సమంతను తన వద్దకు పంపమని కేటీఆర్ కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి. సమంత నిరాకరించడంతో, నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నాపని సురేఖ వ్యాఖ్యానించారు. కేటీఆర్ డిమాండ్‌కు అనుగుణంగా సమంతపై నాగార్జున ఒత్తిడి చేశారని కూడా ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు నాగార్జున ఆగ్రహానికి కారణమయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సనాతన ధర్మ విరోధులతో గొడవ పెట్టుకునేందుకు వచ్చా : పవన్ కళ్యాణ్

విజయవాడ వరద పరిహారం, సర్వే గణాంకాల్లో తప్పులు, సిబ్బంది నిర్వాకం?

ఈ నెల 15 వరకు ఆ ముగ్గురు ఐపీఎస్‌లకు ఊరట

కన్నతండ్రే కూతురిపై అఘాయిత్యం.. గదిలో తలుపులు వేసి..?

బెజవాడ కనకదుర్గమ్మకు కానుకగా వజ్రకిరీటం.. భారీ విలువైన ఆభరణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

పంది కొవ్వు నెయ్యితో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments