Webdunia - Bharat's app for daily news and videos

Install App

Akkineni Nageswara Rao: స్మరించుకున్న మోదీ.. నాగార్జున, శోభిత, చైతూ ధన్యవాదాలు

సెల్వి
సోమవారం, 30 డిశెంబరు 2024 (12:16 IST)
Modi_ANR
అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. మన్ కీ బాత్‌లో అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రధాని మాట్లాడారు. అక్కినేని నాగేశ్వరరావు మానవతా విలువలను కూడా ఆయన తన సినిమాల్లో చాటారని అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. 
 
తెలుగు చిత్రపరిశ్రమకు అక్కినేని ఎంతో సేవ చేశారని.. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ భారతీయ చలనచిత్ర రంగం వైపు చూస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అక్కినేనితో పాటు.. రాజ్ కపూర్, మహ్మద్ రఫీ, తపన్ సిన్హాల సేవలను మోదీ స్మరించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మన సినిమాలు రికార్డులను సృష్టించడంతో పాటు అవార్డులు దక్కించుకుంటున్నాయని చెప్పారు. 
 
అక్కినేని నాగేశ్వరావు మోడీ ప్రశంసించడంతో తెలుగు ప్రేక్షకులంతా సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా అక్కినేని ఫ్యామిలీ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. 
 
"ఐకానిక్‌ లెజెండ్స్‌తో పాటు మా నాన్న ఏయన్నార్‌ గారిని ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరం. ఏఎన్నార్ దూరదృష్టి, భారత సినిమాకి ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తి" అని నాగార్జున అన్నారు. అలాగే నాగ చైతన్య, శోభిత కూడా మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TTD: తిరుమల గ్రీనింగ్ ప్రాజెక్టు.. 2025కల్లా పూర్తి.. రూ.4కోట్లతో ప్రణాళిక

నేను ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ లేదు : సీఎం రేవంత్

Ice Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. ఆ బాలుడికి ఏమైందంటే?

మహిళలపై దాడి చేసిన వైకాపా నేతలను వదిలిపెట్టను : మంత్రి లోకేశ్ మాస్ వార్నింగ్

వైకాపాకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని లేదు.. 2027నాటికి పూర్తి: రామానాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments