Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిగర్ సంఘం ఎన్నికల్లో ఓటు వేయని రజినీకాంత్

Webdunia
ఆదివారం, 23 జూన్ 2019 (18:02 IST)
నడిగర్ సంఘం ఎన్నికల్లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం దర్బార్. ఈ చిత్రం షూటింగ్ ముంబైలో శరవేగంగా సాగుతోంది. దీనికోసం రజినీకాంత్ ముంబైలో మకాం వేసివున్నారు. 
 
కాగా, చెన్నైలో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. ఈ ఎన్నికల్లో సాయంత్రానికి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. అయితే, చాలా మంది నటీనటులు ఈ ఎన్నికల్లో నేరుగా ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. 
 
పలువురు నటీనటులు బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రముఖ నటుడు రజినీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. ఈ ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా ఓటు వేస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. 
 
కాగా, ఈ ఎన్నికల్లో హీరో విశాల్ సారథ్యంలోని పాండవుల జట్టు, సీనియర్ నటు కె. భాగ్యరాజ్ సారథ్యంలోని శంకర్ దాస్ జట్టు పోటీపడుతున్నాయి. విజయావకాశాలపై ఇరు జట్లూ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేపాల్ వెళ్లొద్దు, మాజీ ప్రధాని ఇంటికి నిప్పు, మంటల్లో ఆయన సతీమణి మృతి

మార్చురీకి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. 'సార్.. నేను బతికే ఉన్నాను' అంటూ లేచి కూర్చొన్న వ్యక్తి...

మాటలు సరిగా రాని మైనర్ బాలికపై అత్యాచారం

చంద్రబాబు అరెస్టు చేసిన ఆరోజు, నేటితో రెండేళ్లు - కీలక మలుపు తిప్పిన ఘటన

గ్రహణం రోజున తలపై మండే కుంపటితో అఘోర శ్రీనివాసరావు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

తర్వాతి కథనం
Show comments