నడిగర్ సంఘం ఎన్నికల్లో ఓటు వేయని రజినీకాంత్

Webdunia
ఆదివారం, 23 జూన్ 2019 (18:02 IST)
నడిగర్ సంఘం ఎన్నికల్లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం దర్బార్. ఈ చిత్రం షూటింగ్ ముంబైలో శరవేగంగా సాగుతోంది. దీనికోసం రజినీకాంత్ ముంబైలో మకాం వేసివున్నారు. 
 
కాగా, చెన్నైలో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. ఈ ఎన్నికల్లో సాయంత్రానికి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. అయితే, చాలా మంది నటీనటులు ఈ ఎన్నికల్లో నేరుగా ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. 
 
పలువురు నటీనటులు బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రముఖ నటుడు రజినీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. ఈ ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా ఓటు వేస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. 
 
కాగా, ఈ ఎన్నికల్లో హీరో విశాల్ సారథ్యంలోని పాండవుల జట్టు, సీనియర్ నటు కె. భాగ్యరాజ్ సారథ్యంలోని శంకర్ దాస్ జట్టు పోటీపడుతున్నాయి. విజయావకాశాలపై ఇరు జట్లూ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: నగరంలో ఏం జరుగుతోంది? డాక్టర్ ఇంట్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం

గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజరు రైలు: ఆరుగురు మృతి, పలువరికి తీవ్ర గాయాలు

Praja Darbar: ప్రజా దర్బార్.. నారా లోకేష్ కోసం క్యూలైన్‌లో నిలిచిన ప్రజలు

Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు

Students: పాదాలకు విద్యార్థులచేత మసాజ్ చేసుకున్న టీచర్.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments