Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.80 కోట్ల బడ్జెట్‌తో సినిమా.. పవన్‌కు రూ.40 కోట్ల ఆఫర్?

తెలుగు చిత్రపరిశ్రమలోని నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీస్ మరో భారీ బడ్జెట్ చిత్రానికి ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను నటింపజేయాలని తీవ్రంగా కృషి చేస్తోంది.

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (15:27 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీస్ మరో భారీ బడ్జెట్ చిత్రానికి ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను నటింపజేయాలని తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ చిత్రాన్ని రూ.80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాలన్న యోచనలో ఉంది. ఇందులో హీరో రెమ్యునరేషన్‌గా రూ.40 కోట్లను ఇవ్వనుంది. 
 
నిజానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మానుయేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి, జనసేన పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించాలని పవన్ భావిస్తున్నారు.
 
ఇలాంటి తరుణంలో మైత్రీ మూవీస్ సంస్థ భారీ ఆఫర్‌తో ముందుకురావడం ఇపుడు ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో, పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ చేయాలని భావిస్తున్న పవన్ కల్యాణ్ అయోమయంలో పడిపోయారట. ఏం చేయాలన్న విషయంలో తుది నిర్ణయానికి రాలేకపోతున్నారట. ఒక వేళ పవన్ ఓకే చెబితే... దక్షిణాదిన రజనీకాంత్ తర్వాత అంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరోగా పవన్ రికార్డు సృష్టించనున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments