Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఠాగూర్
బుధవారం, 2 ఏప్రియల్ 2025 (19:41 IST)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వం వహిస్తున్న చిత్రం "విశ్వంభర". ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మెగా అభిమానుల్లో మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. తాజాగా ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ చిత్రంలో హీరో మెగాస్టార్ చిరంజీవి ఓ పాట పాడనున్నారని ఆ వార్త సారాంశం. ఆస్కార్ అవార్డు విన్నర్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీత స్వరాలకు చిరంజీవి గాత్రం అందివ్వనున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే, ఇంకా ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. కానీ మెగా అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. మెగాస్టార్ వాయిస్‌‍లో పాట వినాలని ఆశిస్తున్నారు. 
 
మరోవైపు, చిరంజీవి వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రం ఉగాది సందర్భంగా హైదరాబాద్ నగరంలో ప్రారంభమైంది. జూన్ నెల నుంచ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అలాగే, దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments