Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకుతో కలిసి ప్లాస్మాదానం డొనేట్ చేసిన సంగీత దర్శకుడు కీరవాణి

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (13:15 IST)
టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి రెండోసారి ప్లాస్మా దానం చేశారు. సోమవారం తన కుమారుడు కాలభైరవతో కలిసి కోవిడ్ బాధితుల కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో ప్లాస్మా ఇచ్చారు. కరోనా నుంచి కోలుకున్న వీళ్లిద్దరూ గతంలోనూ ప్లాస్మా ఇచ్చి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
 
శరీరంలో యాంటీబాడీస్ ఇంకా యాక్టివ్‌గా ఉండటం వల్ల ప్లాస్మా ఇస్తున్నట్లు వారు తెలిపారు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నట్లు వారు తెలిపారు. త్వరలో RRR మ్యూజిక్ ప్రారంభిస్తామని కీరవాణి వెల్లడించారు. అంతకుముందు వీళ్లిద్దరూ కిమ్స్ హాస్పిటల్లో మొదటిసారి ప్లాస్మాను దానం చేసినట్లు తెలిపారు.
 
అటు రాజమౌళి కూడా త్వరలో ప్లాస్మా డొనేట్ చేయనున్నట్లు తెలిపారు. గత కొద్దిరోజుల క్రితం రాజమౌళి, కీరవాణి కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కీరవాణి తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు.
 
మా రక్తంలో ప్రతిరోధకాలు ఇంకా చురుకుగా ఉండటంవల్లే నేను మా కొడుకు రెండోసారి ప్లాస్మా దానం చేశాము. ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్లాస్మా దానం ఇవ్వడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కీరవాణి వెల్లడించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments