Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖేష్ అంబానీ కామెంట్... ఐష్ సినిమాకు షాక్... బాబ్బాబు ప్లీజ్.. ఈ ఒక్క సినిమా...

ఐశ్వర్యా రాయ్ తాజాగా నటించిన చిత్రం యే దిల్ హై ముష్కిల్ చిత్రంలో పాకిస్తాన్ నటులు ఉండటంతో ఇప్పుడా చిత్రం విడుదలపై కారుమబ్బులు కమ్ముకున్నాయి. ఈ చిత్రాన్ని విడుదల చేసేది లేదని ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, గోవాకు చెందిన సింగిల్ స్క్రీన్ థియేటర

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (15:12 IST)
ఐశ్వర్యా రాయ్ తాజాగా నటించిన చిత్రం యే దిల్ హై ముష్కిల్ చిత్రంలో పాకిస్తాన్ నటులు ఉండటంతో ఇప్పుడా చిత్రం విడుదలపై కారుమబ్బులు కమ్ముకున్నాయి. ఈ చిత్రాన్ని విడుదల చేసేది లేదని ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, గోవాకు చెందిన సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు ప్రకటించారు. ఇదిలావుండగా తాజాగా ముఖేష్ అంబానీ చేసిన వ్యాఖ్యలు దీనికి తోడయ్యాయంటున్నారు. వాస్తవానికి ఆయన ఈ చిత్రం గురించి నేరుగా మాట్లాడలేదు. 
 
ప్రముఖ పాత్రికేయులు శేఖర్ గుప్తా, బర్ఖాదత్ ఆధ్వర్యంలో ది ప్రింట్ నిర్వహించిన ఆఫ్ ది కప్ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ మాట్లాడారు. తనకు కళలు, సంస్కృతి వీటన్నిటికన్నా భారతదేశమే ముఖ్యమైందని స్పష్టం చేశారు. తానేమీ మేధావిని కాదనీ, అందుకే ఇలాంటివి తనకు అర్థం కాదని చెప్పిన ముఖేష్, తను అందరిలా భారతీయుడినే కాబట్టి దేశభక్తికే ఓటు వేస్తానని చెప్పారు. దీనితో కరణ్ జోహార్ దిగివచ్చి... బాబ్బాబు ఈ ఒక్క సినిమాను వదిలేయండి. ఇకపై పాకిస్తాన్ దేశానికి చెందిన నటీనటులతో సినిమాలు చేయనని బ్రతిమాలుకుంటున్నారు. మరి దీపావళి నాటికి ఐశ్వర్యారాయ్ నటించిన చిత్రం దేశంలో ఎన్ని సినిమా హాళ్లలో విడుదలవుతుందో చూడాల్సిందే.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments