Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపిస్టులను శిక్షించరా..? అమ్మాయిని కనాలంటేనే భయంగా వుంది: దివ్యాంక

''మనసుపలికే మౌనగీతం'' సీరియల్ నటి దివ్యాంక మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. దేశానికి మహిళలు ముఖ్యం కాదనుకునే పార్టీలకు ఓట్లు వేయడాన్ని మహిళలు ఇక ఆపాలని పిలుపునిచ్చారు.

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (16:35 IST)
''మనసుపలికే మౌనగీతం'' సీరియల్ నటి దివ్యాంక మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. దేశానికి మహిళలు ముఖ్యం కాదనుకునే పార్టీలకు ఓట్లు వేయడాన్ని మహిళలు ఇక ఆపాలని పిలుపునిచ్చారు.

మహిళలపై వావివరుసలు లేకుండా, వయోభేదం లేకుండా కామాంధులు విరుచుకుపడుతుంటే మేము ఎందుకు ఓటేయాలని అడిగారు. మనం ఏ స్వతంత్ర్యం గురించి మాట్లాడుకుంటున్నాం.. రేపిస్టులు స్వేచ్ఛగా తిరుగుతున్న లోకంలో జీవిస్తున్నామా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 70 ఏళ్ల స్వాతంత్ర్యం ఇంకా తమకు స్వేచ్ఛనివ్వలేదని మండిపడ్డారు. 
 
స్వాతంత్ర్య దినోత్సవం రోజునే చండీఘడ్‌లో ఓ వ్యక్తి 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడటంపై దివ్యాంక తీవ్రంగా ఖండించారు. పాఠశాలలో జెండా వందనానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న బాలికపై ఇలాంటి దారుణం చోటుచేసుకోవడంపై దేశంలో మహిళల భద్రతను ఉద్దేశించి దివ్యాంక ట్విటర్‌లో తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లను కనాలంటేనే భయంగా ఉందన్నారు. ప్రస్తుతం అమ్మాయిని కాపాడటంలో ''భేటీ బచావో'' కార్యక్రమం ఏమైంది? అడిగారు. 
 
తనకు కుమారుడికి జన్మనివ్వాలని లేదు. ఇక అమ్మాయిని కనాలంటే భయంగా వుందని దివ్యాంక అన్నారు. ఒకవేళ అమ్మాయిని కంటే స్వర్గం నుంచి ఈ నరకానికి ఎందుకు తీసుకొచ్చావని అడిగితే ఏం చెప్పను అంటూ దివ్యాంక ట్వీట్ చేశారు. క్రూరమైన నేరాలు చేసే వారిని ఎందుకు క్రూరంగా శిక్షించరు?.. ఇకనైనా పార్టీలు మేల్కోవాలని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments