Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవిని మరోమారు కుట్టిన కరోనా వైరస్

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (10:09 IST)
మెగాస్టార్ చిరంజీవికి కరోనా వైరస్ మరోమారు సోకింది. మంగళవారం నుంచి స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
కాగా, ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని, ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే, త్వరలోనే కోలుకుని మిమ్మలను కలుస్తానని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. 
 
గతంలో కూడా చిరంజీవి కరోనా వైరస్ బారినపడ్డారు. అపుడు కూడా హోం క్వారంటైన్‌లో ఉండి కోలుకున్నారు. ఆ సమయంలో చిరంజీవి ఇంటి పనిమనిషికి తొలుత వచ్చింది. ఆ తర్వాత చిరంజీవి ఇంట్లోని పలువురు కుటుంబ సభ్యులకు ఈ వైరస్ సోకింది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్, మెగా బ్రదర్ నాగబాబు, హీరో పవన్ కళ్యాణ్ కూడా ఈ వైరస్ బారినపడి కోలుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments