వాజ్‌పేయి నిజమైన రాజనీతిజ్ఞుడు : మెగాస్టార్ చిరంజీవి

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (15:01 IST)
మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి నిజమైన రాజనీతిజ్ఞుడని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. పైగా, తనకు లాల్ బహదూర్ శాస్త్రి, వాజ్‌పేయి ఇష్టమైన రాజకీయ నేతలుగా చెప్పారు. మహాత్మా గాంధీ పుట్టిన రోజునే జన్మించిన శాస్త్రి కూడా బాపూజీలాగే తన జీవితాన్ని గడిపారని గుర్తుచేశారు. 
 
ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం "గాడ్‌ఫాదర్". ఇటీవల విడుదలైన మంచి విజయం అందుకుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. ఇందులో చిరుని పూరి ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. 
 
ఈ సినిమా పొలిటికల్ డ్రామా కావడంతో మీకు ఇష్టమైన రాజకీయ నేతలు ఎవరు అంటూ పూరి ప్రశ్నించారు. దీనికి చిరంజీవి ఏమాత్రం ఇబ్బందిపడకుండా ఈ జనరేషన్‌లో ఇష్టమైన నేతలు ఎవరు అంటే తన వద్ద సమాధానం లేదన్నారు. 
 
అయితే, పాత కాలంలో చాలా మంది గొప్ప నేతలు ఉన్నారని, పార్టీలకు అతీతంగా వాళ్లంటే తనకు ఇష్టమని చెప్పారు. శాస్త్రి, వాజ్‌పేయి తనకు ఇష్టమైన నాయకులు అని చెప్పారు. ఈ ఇద్దరి నాయకత్వంలో మన దేశం చాలా పురోగతిని సాధించిందని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొగాకు ఉక్కుపాదం- ధూమపాన నిషేధాన్ని అమలు చేసిన మాల్దీవులు

ASI: డ్రైవర్‌కు కళ్లు కనిపించలేదా? నీళ్ల ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ మృతి

భార్య, వదిన, కుమార్తెలను కత్తితో పొడిచి హత్య.. ఆపై ఉరేసుకున్న వ్యక్తి.. ఎందుకిలా?

Jogi Ramesh: కల్తీ మద్యం కేసు: మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేష్ అరెస్ట్

Happy Bride: ఇష్టపడి పెళ్లి చేసుకుంటే అమ్మాయిలు ఇలానే వుంటారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments