Webdunia - Bharat's app for daily news and videos

Install App

"సైరా" టీజర్ ఔట్.. గురూజీ ఆగమనం (వీడియో)

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (13:40 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అత్యంత కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బిగ్ బి గురువారం తన 76వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. దీంతో సైరాలో ఆయన పోషించే కీలక పాత్రకు సంబంధించిన లుక్‌తో టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అమితాబ్‌ గోసాయి వెంకన్న పాత్రలో కన్పించబోతున్నారు. ఇందులో ఆయన నరసింహారెడ్డికి గురువుగా నటించారు.
 
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గురువు పాత్రలో అమితాబ్‌ ఒదిగిపోయారు. ఆయన లుక్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో యుద్ధ సన్నివేశాలను హాలీవుడ్‌ నిపుణుల ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
 
ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌‌ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందన్న టాక్ ఇప్పటికే వుంది. ఇందుకోసం ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, అదిరిపోయే గ్రాఫిక్స్‌తో ఈ యుద్ధ సన్నివేశం ఒళ్లు గగురుపొడిచేలా ఉంటాయని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈచిత్రానికి అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్నారు.
 
ప్రస్తుతం జార్జియాలో షూటింగ్‌ జరుపుకుంటోంది. అక్కడ షూటింగ్ ముగిసిన తర్వాత మరోసారి హైదరాబాద్‌లో షెడ్యూల్‌ ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. కాగా, ఈ చిత్రంలో అమితాబ్‌, నయనతార, విజయ్‌సేతుపతి, జగపతిబాబు, సుదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్‌ తదితర భాషల్లో సినిమా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments