Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబాయ్.. నీ మాటలే మాకు స్ఫూర్తి... గ్రామాన్ని దత్తత తీసుకున్న చెర్రీ

Webdunia
ఆదివారం, 21 అక్టోబరు 2018 (16:56 IST)
శ్రీకాకుళం జిల్లాను తిత్లీ తుఫాను సర్వనాశనం చేసింది. అనేక గ్రామాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితిలో లేవు. ఈ గ్రామాల్లో ప్రజలు గుక్కెడు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో తిత్లీ ప్రజలను ఆదుకునేందుకు పారిశ్రామిక వేత్తలు, రాజకీయ, సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు.
 
ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు, యంగ్ హీరో రామ్ చరణ్ శ్రీకాకుళం ప్రజలకు అండగా ఉండేందుకు ముందుకొచ్చారు. తానున్నానంటూ అభయ హస్తం ఇచ్చారు. తిత్లీ తుఫాను ప్రభావిత గ్రామాన్ని దత్తత తీసుకోవాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
 
తన బాబాయ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని వెల్లడించారు. అయితే ఏ గ్రామాన్ని దత్తత తీసుకుంటారనే విషయం త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. గ్రామం దత్తత విషయంపై తన బృందంతో చర్చించానన్నారు. ఏ గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్నది తాను నియమించిన బృందం గుర్తిస్తుందని, ఆ తర్వాత గ్రామాన్ని దత్తత తీసుకుంటానని రామ్ చరణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్.. కీలక పరిణామం.. ఏంటది?

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేందుకు ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నా: పాల్

OTTs : పాకిస్తాన్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను బంద్ చేయాలి.. కేంద్రం ఆదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments