Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబాయ్.. నీ మాటలే మాకు స్ఫూర్తి... గ్రామాన్ని దత్తత తీసుకున్న చెర్రీ

Webdunia
ఆదివారం, 21 అక్టోబరు 2018 (16:56 IST)
శ్రీకాకుళం జిల్లాను తిత్లీ తుఫాను సర్వనాశనం చేసింది. అనేక గ్రామాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితిలో లేవు. ఈ గ్రామాల్లో ప్రజలు గుక్కెడు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో తిత్లీ ప్రజలను ఆదుకునేందుకు పారిశ్రామిక వేత్తలు, రాజకీయ, సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు.
 
ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు, యంగ్ హీరో రామ్ చరణ్ శ్రీకాకుళం ప్రజలకు అండగా ఉండేందుకు ముందుకొచ్చారు. తానున్నానంటూ అభయ హస్తం ఇచ్చారు. తిత్లీ తుఫాను ప్రభావిత గ్రామాన్ని దత్తత తీసుకోవాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
 
తన బాబాయ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని వెల్లడించారు. అయితే ఏ గ్రామాన్ని దత్తత తీసుకుంటారనే విషయం త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. గ్రామం దత్తత విషయంపై తన బృందంతో చర్చించానన్నారు. ఏ గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్నది తాను నియమించిన బృందం గుర్తిస్తుందని, ఆ తర్వాత గ్రామాన్ని దత్తత తీసుకుంటానని రామ్ చరణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments