Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఉయ్యాలవాడ నరసింహారెడ్డి''గా చిరంజీవి: పూజ సక్సెస్.. ఆగస్టు 22న ఫస్ట్ లుక్.. హీరోయిన్‌గా నయన?

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకో శుభవార్త. ఖైదీ 150 సినిమాకు తర్వాత 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో చిరంజీవి నటించబోతున్నారు. ఈ సినిమాకు తొలి అడుగు పడింది. బుధవారం కొణిదెల ప్రొడక్షన్స్‌ కార్యాలయ

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (16:13 IST)
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకో శుభవార్త. ఖైదీ 150 సినిమాకు తర్వాత 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో చిరంజీవి నటించబోతున్నారు. ఈ సినిమాకు తొలి అడుగు పడింది. బుధవారం కొణిదెల ప్రొడక్షన్స్‌ కార్యాలయంలో పూజా కార్యక్రమంతో సినిమా ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమంలో చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ, కుమారుడు, హీరో రామ్ చరణ్, నిర్మాత అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. 
 
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా... కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాంచరణ్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా నయనతారను తీసుకోవాలని చిత్రబృందం సంప్రదింపులు జరుపుతోంది. 
 
ఇక ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు సినీ యూనిట్ ప్రయత్నిస్తోంది. రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నాలుగు భాషల్లో తెరకెక్కే ఈ చిత్రం నటీనటుల వివరాలను నిర్మాత రామ్ చరణ్ త్వరలో ప్రకటిస్తారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments