Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేవకు కూడా ఏపీలో యుద్ధం చేయాల్సివస్తుంది: నాగబాబు

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (13:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాసేవ (జనసేవ) చేసేందుకు సైతం యుద్ధం చేయాల్సిన దుస్థితి నెలకొందని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌రు 2న జ‌న‌సేన పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా శ్ర‌మ‌దాన కార్య‌క్ర‌మాలు నిర్వహించాయి. జనసైనికులు అనేక ప్రాంతాల్లో రోడ్లకు మరమ్మతులు చేశారు. 
 
అయితే, అధికార వైకాపా పార్టీ నేతల ఒత్తిడి మేరకు... పోలీసులు రోడ్లు బాగుచేయ‌నివ్వ‌కుండా కొంద‌రు అడ్డంకులు సృష్టించార‌ని జ‌న‌సేన తెలిపింది. దీనిపై సినీన‌టుడు నాగ‌బాబు స్పందిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు.
 
'మన రాష్ట్రంలోని దుస్థితి ఏంటంటే జనసేవకు కూడా ఒక యుద్ధమే చేయవలసి వస్తోంది. చంద్ర‌గిరి నియోజ‌క వ‌ర్గంలోని జ‌న‌సైనిక్ మ‌నోహ‌ర్ దేవర శ్రీవిద్యా నికేత‌న్ సంస్థ స‌మీపంలో అర‌కిలోమీట‌రు రోడ్డును బాగు చేయించారు. కొంద‌రు అడ్డుకోవాల‌ని చూసిన‌ప్ప‌టికీ విజ‌య‌వంతంగా ప‌ని పూర్తి చేశారు' అని నాగ‌బాబు చెప్పారు. 
 
కాగా, రోడ్డు వేసేందుకు కావాల్సిన మెటీరియ‌ల్‌ను ఆ ప్రాంతంలోకి రాకుండా అడ్డుకోవాల‌ని కొంద‌రు ప్ర‌య‌త్నాలు చేశార‌ని వీడియోలో జ‌న‌సేన చెప్పింది.  దీనికి సంబంధించిన వీడియోను ఒకటి నాగబాబు షేర్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments