Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకు మాత్ర‌మే చెప్తా సెన్సార్ టాక్ ఏంటి..?

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (16:05 IST)
విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ హౌస్ “కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్” పతాకంపై రూపొందిన సినిమా “మీకు మాత్రమే చెప్తా”. ఈ మూవీకి ఎలాంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెన్సార్ సభ్యులు ‘మీకు మాత్రమే చెప్తా’ టీంను అభినందించారు.
 
న్యూఎజ్ ఫన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ‘మీకు మాత్రమే చెప్తా’కు రిలీజ్‌కు ముందు పరిశ్రమలోనూ, ప్రేక్షకులలోనూ అటెన్షన్‌ని క్రియేట్ చేసింది. టీజర్, ట్రైలర్‌తో పాటు విజయదేవరకొండ చేసిన ప్రమోషనల్ వీడియో సాంగ్ ‘నువ్వే హీరో’కు మంచి రెస్సాన్స్ అందుతుంది.
 
 ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ: ‘సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి, సెన్సార్ సభ్యులు నుండి మంచి రెస్సాన్స్ వచ్చింది. సినిమా నిర్మాణంలో అడుగుపెట్టిన మాకు మొదటి సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’ చాలా స్పెషల్‌గా నిలుస్తుంది. 
 
కొత్త తరహా ఆలోచనలను ప్రొత్సహించేందుకు “కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్ టైన్మెంట్” ఎప్పుడూ ముందు ఉంటుంది. ఈ సినిమా యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుందన్న నమ్మకం మాకు ఉంది. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్‌గా ‘మీకు మాత్రమే చెప్తా’ నిలుస్తుంది’ అన్నారు.
 
 నవంబర్ 1న రిలీజ్ అవుతున్న“మీకు మాత్రమే చెప్తా”లో తరుణ్ భాస్కర్, అనసూయ భరద్వాజ్‌తో పాటు అభినవ్ గౌతమ్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోదీ మీడియా సమావేశం ముగిసిన కొద్ది నిమిషాల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన

భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Andhra Pradesh: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఏపీ సర్కారు చర్యలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments