Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్‌గా చేయాలనివుంది... అందుకే ఆ డైరెక్టర్స్‌‍తో.. : 'మీన్ గర్ల్స్' అవంతిక

ఠాగూర్
మంగళవారం, 19 మార్చి 2024 (09:04 IST)
తనకు తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా చేయాలనివుందని 'మీన్ గర్ల్స్' అవంతిక అంటున్నారు. తన కలను సాకారం చేసుకునేందుకు వీలుగా టాలీవుడ్ అగ్ర దర్శకులు రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల వంటివారిని త్వరలోనే కలుస్తానని ఆమె చెప్పారు. 'మీన్ గర్ల్స్' చిత్రంతో ఒక్కసారిగా పాపులర్ అయిన అవంతిక.. 'బిగ్ గర్ల్స్ డోంట్ క్రై' అనే సిరీస్ ద్వారా మరింత గుర్తింపును సొంతం చేసుకుంది. యూత్‌లో చాలా వేగంగా ఫాలోయింగ్‌ను కలిగిన ఆమె... తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను వెల్లడించారు. 
 
'మీన్ గర్ల్స్‌'కి వెళ్లొచ్సిన మూడు నెలల తర్వాత తనకు ఎలాంటి పిలుపు రాలేదన్నారు. దీంతో తనకు అవకాశం రాదని భావించాను. కానీ, ఓ రోజున పిలుపు రావడంతో నమ్మలేకపోయాను. ఆ చిత్రంలో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఇంతవరకూ నా వయసుకు తగిన పాత్రలను పోషిస్తూ వచ్చాను. త్వరలోనే తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా చేస్తాను అని చెప్పారు. 
 
ముఖ్యంగా, టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, శేఖర్ కమ్ముల వంటి దర్శకుల సినిమాలు అంటే తనకు అమితమైన ఇష్టమన్నారు. త్రివిక్రమ్ 'అజ్ఞాతవాసి' చిత్రంలో తాను నటించినట్టు చెప్పారు. అలాగే, మిగిలిన హీరోల చిత్రాల్లో హీరోయిన్‌గా నటించాలని ఉందన్నారు. తన కోరికను నెరవేర్చుకునేందుకు త్వరలోనే వాళ్లందరిని కలిసి అడిషన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments