Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరువ తరమ నుంచి పరవశమే.. మెలోడీ పాట విడుదల

డీవీ
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (16:13 IST)
Advait Dhanunjaya - Atulya
ఓ ఫీల్ గుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీ 'మరువ తరమా'  రాబోతోంది. అద్వైత్ ధనుంజయ  హీరోగా  అతుల్యా చంద్ర, అవంతిక నల్వా హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ మీద గిడుతూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు. 
 
ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలా ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తూనే సినిమా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ మంచి మెలోడీ పాటను విడుదల చేశారు. పరవశమే అంటూ సాగే ఈ పాట శ్రోతలకు ఎంతో వినసొంపులా ఉంటుంది. విజయ్ బుల్గానిన్ బాణీ ఎంతో శ్రావ్యంగా ఉంది. చైతన్య వర్మ సాహిత్యం, గౌతమ్ భరద్వాజ్ గాత్రం ఈ పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేస్తున్నాయి.
 
ఈ చిత్రానికి రుద్ర సాయి కెమెరామెన్‌గా, కె.ఎస్.ఆర్ ఎడిటర్‌గా వ్యవహరించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు.
 
నటీనటులు : అద్వైత్ ధనుంజయ , అతుల్యా చంద్ర, అవంతిక నల్వా తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గాజాలో హమాస్ నేత యాహ్యా సిన్వర్‌ను చంపేశాం.. ఇజ్రాయేల్

కీలక ప్రాంతాల్లో ఫ్లెక్సీలు - బ్యానర్లు నిషేధం : ఏపీ మంత్రి కె.నారాయణ

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... ఏపీకి వర్షాలే వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

కెనడాలో ఏమాత్రం చలనం లేదు.. ఆరోపణలు తిప్పికొట్టిన భారత్

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments